2, జూన్ 2023, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -40

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళుతున్నాను .. తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను కోట్ల మందికి విశ్వాసం కలిగించి .. ఆత్మహత్యలను ఆపిన ఒక్క మాట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -40 ----------------------------------------------------------------------- అంతా అయ్యాక ఇప్పుడు ఇప్పుడు ఏ టుంరీలు ఏమైనా మాట్లాడవచ్చు . కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఈజీగా ఏమీ రాలేదు . ప్రతి క్షణం సస్పెన్స్ .. నరాలు తెగేంత ఉత్కంఠత ... ఏమవుతుందో తెలియని భయం .. మరో వైపు మాఫియా మీడియా ... సాధారణంగా బ్రేకింగ్ న్యూస్ లు మనకు తెలిసినవే .. బ్రేకింగ్ న్యూస్ కాకుండా అతికించే న్యూస్ ఒకే ఒక్కటి .. అది ఎంతో మంది ప్రాణాలు తీసింది .. భయపెట్టింది . ఒక్క మాట ఔను ఒకే ఒక్క మాట పోయే ప్రాణాలను నిలబెట్టింది ... మాటకు ఎంత శక్తి ఉంటుందో నిరూపించిన మాట అది . మీడియా ప్రచారం వల్ల సర్వత్రా నిరాశ ఆవహించిన సమయం అది ఆత్మ హత్యలు మళ్ళీ మొదలైన సమయం ఆ సమయంలో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ వస్తుంది అని తాను చెప్పదలుచుకున్నది చెప్పి ... ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను , తెలంగాణ రాష్ట్రం తోనే తిరిగి వస్తాను అని పిడికిలి బిగించి ఆత్మవిశ్వసం తో పలికారు . ఆ విలేఖరుల సమావేశం లో నేనూ సి డబ్ల్యూ సి నిర్ణయం అయిపోయిన తరువాత నాకు ఎప్పుడూ తెలంగాణ రాదేమో అనే అనుమానం కలుగలేదు . కానీ మీడియా ప్రచారంతో భయాలు పెంచారు . మీడియా సమావేశం ముగించి కిందకు వచ్చాక కెసిఆర్ గారికి అదే చెప్పాను .. ఆత్మ విశ్వసం తో మీరు చేసిన ప్రకటన బాగుంది . టివిల వల్ల భయం పెరిగింది . మీ ప్రకటనతో తెలంగాణ కోరుకుంటున్న వారిలో ఆత్మ విశ్వసం పెరుగుతుంది అని .... ****** 16 డిసెంబర్ 2013న రాష్ట్ర విభజన కు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లును అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు . అంతకు ముందే సి డబ్ల్యూ , సి నిర్ణయం అయిపొయింది . కేంద్ర మంత్రులం మండలి ఆమోదం అయిపొయింది . డ్రాఫ్ట్ బిల్లు రాష్ట్రపతికి పంపడం అయిపొయింది . సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి పంపించారు . అభిప్రాయం కోసమే తప్ప అసెంబ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదు . ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండడం తెలంగాణలో తక్కువ సంఖ్య కావడం వల్ల బిల్లు వీగిపోతుంది అని ముందే తెలుసు . ఐతే అసెంబ్లీలో బిల్లు వీగిపోగానే తెలుగు మీడియా హడావుడి అంతా ఇంత కాదు . బ్రేకింగ్ న్యూస్ ల స్థానంలో టివిలు పగిలిపోయేంత శబ్దం తో ఆంధ్ర తెలంగాణ రెండింటిని జాతక బెడుతున్నట్టు చూపిస్తూ హడావుడి చేశారు . ఆ రోజు అసెంబ్లీ ముగియగానే లాబీ నుంచి బయటకు వస్తే మెట్ల వద్ద న్యాయ నిపుణులు జంధ్యాల రవి శంకర్ జర్నలిస్ట్ లతో ఇప్పుడేమవుతుంది అని చెబుతున్నారు . అసెంబ్లీ తీర్మానమే అత్యున్నతం అన్నట్టుగా సాగుతుంది ఆయన వాదన . ఎక్కువ మంది జర్నలిస్ట్ లు అదే కోరుకుంటున్నందున ఆసక్తిగా వింటున్నారు . కొంత సేపు విని నేను అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలను అతక బెట్టేస్తారా ? అని కొంత వెటకారంగా అడిగాను . అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే అడిగారు , ఆ అభిప్రాయం అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు అని కేంద్రం చెబుతున్నప్పటికీ మీడియా ప్రచారం వల్ల మరికొన్ని ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి . ఆ సమయంలోనే కెసిఆర్ సాయంత్రం తెలంగాణ భవన్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళుతున్నాను . తెలంగాణ లోనే తిరిగి వస్తాను అని అటు నుంచే ఢిల్లీ వెళ్లి .. నిజంగా తెలంగాణ సాధించిన తరువాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టారు . తిరిగి వచ్చాక ఆ రోజు ఒక్క NDTV తోనే మాట్లాడారు . మాకు కాంగ్రెస్ తోనే పోటీ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరం అయితే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని కెసిఆర్ చెప్పారు . ప్రధాన ప్రత్యర్థికే మద్దతు ఇవ్వడానికి సిద్దపడడాన్ని NDTV ఆశ్చర్యంగా చూసింది . ***** మల్లిక్ కార్టూన్ ఒకటి .. కెసిఆర్ పక్కన ఉంటే ఒక వ్యక్తి పది హేను రోజుల్లో తెలంగాణ వస్తుందట అని కిందపడి దొర్లుతూ నవ్వుతుంటాడు . మల్లిక్ కార్టూనిస్ట్ కాబట్టి తన మనసులోని అభిప్రాయాన్ని కార్టూన్ రూపం లో ప్రదర్శించారు . తెలంగాణ వస్తుంది అని కెసిఆర్ చెప్పినప్పుడు చాలా మంది నాయకులు ఇలానే ఎకసెక్కాలు ఆడేవారు . ఢిల్లీ నుంచి నాకు సిగ్నల్స్ ఉన్నాయి , తెలంగాణ ఏర్పడుతుంది అని కెసిఆర్ చెబితే చాలా మంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్ లో టవర్లు ఏమైనా ఏర్పాటు చేశారా అని జోకులేశారు . సి డబ్ల్యూ సి తొలి సమావేశం లోనే నిర్ణయం తీసుకోలేదు . అనేక సార్లు సమావేశాలు జరిగాయి . సమావేశం లో ఏ నిర్ణయం తీసుకోక పోతే తుస్సు మన్న సి డబ్ల్యూ సి సమావేశం అని కొమ్మినేని కామెంట్ గుర్తుంది . తీరా సి డబ్ల్యూ సి లో తెలంగాణ ఏర్పాటు కు నిర్ణయం తీసుకుంటే , ఎవరినీ సంప్రదించకుండా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు అని ధ్వజమెత్తారు . **** కెసిఆర్ తో మాట్లాడితే తెలంగాణ వస్తుంది అని నమ్మకం కలుగుతుంది . బయటకు వెళ్లి ఎవరితో మాట్లాడినా తెలంగాణ రాదు అనిపిస్తోంది అని జర్నలిస్ట్ మిత్రుడు అనే వాడు . బాగ్ లింగం పల్లి వద్ద 69 ఉద్యమ కారుల సమావేశం జరిగింది . గద్దర్ పాల్గొన్నారు . తెలంగాణ వస్తుందా ? అని అడిగితే ఆంధ్ర నాయకుల లాబీ సామాన్య మైనది కాదు . రానివ్వరు అని చెప్పారు . యుద్ధ నౌకలు , అప్పుడు ఉద్యమం లో కీలక స్థానాల్లో ఉన్న నాయకులను సకల జనుల సమ్మె అప్పుడు అడిగితే రాదు అన్నట్టుగానే మాట్లాడేవారు . ఒక్క కెసిఆర్ మాత్రం ఉద్యమ సన్నాహక సమావేశాలు నుంచి చివరి వరకు తెలంగాణ వస్తుంది .. ఎలా వస్తుందో చెప్పేవారు .

1, జూన్ 2023, గురువారం

దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే ..... విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 39

దమ్మున్న మీడియా దీవిస్తే ఎవరైనా మటాషే ..... విజయశాంతి నుంచి షర్మిల వరకు సేమ్ రిజల్ట్స్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 39 ------------------ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలిపేయమని ఒకరు పిలుపు ఇస్తే , ఆంధ్ర కాంగ్రెస్ లో చేరమని మరొకరి పిలుపు . ప్రతి రోజు ఆంధ్ర జ్యోతి మొదటి పేజీని అలంకరించి , సీఎంలను మించి ఆ మీడియాలో ప్రాధాన్యత పొందిన షర్మిల కు ఎన్ని సీట్లు అనే చర్చ నుంచి అసలు ఆమె పోటీ చేస్తుందా ? ఏ పార్టీలో కలిసి పోతుంది అనే చర్చ సాగుతోంది . పార్టీలో చేరిపోవాలి అని కాంగ్రెస్ పిలుపు ఇస్తే నాకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయి అని ఆమె చెబుతోంది . సీఎంను అవుతాను అని abn ఛానల్ లో చెప్పిన ఆమె అసలు పోటీ చేస్తుందా ? అనుమానమే . .. ఎందుకిలా అని ఆలోచిస్తే పాపం ఆంధ్ర జ్యోతి దీవెనలతో వెలుగు చూసిన అన్ని పార్టీల పరిస్థితి ఇదే అని చరిత్ర కళ్ల ముందు కనిపించింది . ***** పలానా పెద్దాయన దీవిస్తే మంచి జరుగుతుంది . ఆమె దీవెనలు ఉంటే అనుకున్నది అవుతుంది ... ఆ డాక్టర్ష హస్తవాసి మంచిది . పోవడానికి సిద్ధం అయిన వారు కూడా లేచి కూర్చుంటారు - అంటుంటారు . ఇవి నమ్మకాలు . వీటికి శాస్త్రీయత ఏమీ ఉండదు . ఐనా నమ్ముతుంటారు . . విచిత్రంగా మీడియాకు సంబంధించి కూడా ఇలాంటి నమ్మకం ఒకటి ఉంది . పాపం రాధాకృష్ణ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన దీవెనలు అందుకున్న పార్టీలు అన్నీ మటాష్ అయ్యాయి . ఈ నమ్మకానికి శాస్త్రీయత లేకపోవచ్చు , కానీ అలా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. విజయశాంతి పార్టీ తల్లి తెలంగాణ నుంచి షర్మిల తెలంగాణ వై యస్ ఆర్ కాంగ్రెస్ వరకు అన్ని పార్టీలను వారి మీడియా భుజాన మోసి దీవెనలు అందించింది ... ఆచారం తప్పకుండా దీవెనలు పొందిన అన్ని పార్టీలు చావు దెబ్బ తిన్నాయి . అదే సమయంలో వారి మీడియా శపించిన పార్టీలు అధికారం లో వెలిగి పోతున్నాయి . అటు ఆంధ్ర లో ఇటు తెలంగాణ లో .... ***** షర్మిల కాంగ్రెస్ లో చేరాలి అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు ... ఆంధ్రకు వెళ్లి రాజకీయం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి సుచించారు ... షర్మిల కాంగ్రెస్ లో చేరుతారు అని కొన్ని పత్రికల్లో , ఆంధ్ర కాంగ్రెస్ లో అని మరి కొన్ని పత్రికల్లో వార్తలు . ఆమె నేమో నేను సీఎం ను అవుతున్నాను అని Abn ఛానల్ ఇంటర్వ్యూ లో చెబుతుంటే ... ఆమెకో పార్టీ ఉందని , దానికో పేరు ఉందనిమరిచిపోతున్నారు . వాట్స్ ఆప్ లో మాత్రమే కనిపించే వాట్స్ ఆప్ పత్రికల సర్వేల్లో ఆమెకు ఉదారంగా 74 సీట్లు ఇస్తుంటే ఇవేవీ గుర్తించకుండా కాంగ్రెస్ వాళ్ళు పార్టీలో చేరిపొమ్మంటున్నారు . ఆంధ్ర లో అన్న ను తీవ్రంగా వ్యతిరేకించాలి . అవసరం ఐతే రాష్ట్రపతి పాలన పెట్టించాలి . ఇటు తెలంగాణలో అన్న చెల్లిని ఆకాశానికి ఎత్తాలి , తెలంగాణ ను రక్షించడానికి అవతరించిన దేవత అన్నట్టు చూపించాలి . దీనికోసం ఎంత కష్టపడుతున్నారు . . ఇది మాములు విషయమా ? ఒకే కుటుంబంలో అన్నను రాక్షసుడిగా , చెల్లిని దేవతగా చూపాలి అంటే ఆషామాషీ కాదు దమ్ముండాలి . తమకా దమ్ముందని పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అండగా నిలిస్తే .... కాంగ్రెస్ లో కలిపేయండి.. ఆంధ్రాలో ఓ టికెట్ ఇస్తాం అనడం ఎంత అమానవీయం . ***** విజయ శాంతికి ఆంధ్ర జ్యోతికి ఎంతో అనుబంధం ఉంది .ఆంధ్రజ్యోతి మొదటి యజమాని కి సినిమా వ్యాపారాలు ఉన్నాయి . ఉమ్మడి రాష్ట్రం లో ఆంధ్ర జ్యోతి తొలుత విజయవాడ నుంచే వచ్చేది . సచివాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఓ గది కార్యాలయంగా ఉండేది . ఆంధ్ర జ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభం ప్రచారం ఓ సంచలనం. అప్పటి వరకు ఈనాడు , ఉదయం తమ ఎడిషన్ లు ప్రారంభించేప్పుడు ఉదృతంగా ప్రచారం చేశాయి . ఉదయం ఐతే ఏకంగా ఉదయం టైటిల్ ఎలా ఉండాలో చెప్పండి అని అనేక డిజైన్ లలో అప్పటి అన్ని పత్రికల్లో మొదటి పేజీ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు . కానీ ఆంధ్రజ్యోతి మాత్రం నభూతో న భవిష్యతి అనే విధంగా విజయశాంతి పోస్టర్ లతో ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రచారం చేశారు . అప్పుడు విజయశాంతి హీరోయిన్ గా సినిమా రంగాన్ని ఏలేస్తున్నారు . దిన పత్రికకు హీరోయిన్ పోస్టర్ తో ప్రచారం ఏమిటా ? అని సాంప్రదాయ వాదులు ముక్కున వేలేసుకున్నారు కానీ బాగానే వర్కౌట్ అయింది . విజయశాంతి తెలంగాణ తల్లి పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పాత అనుబంధాలతో ఆంధ్రజ్యోతిలో ప్రచారంతో హోరెత్తించారు . బహుశా తెలంగాణలోనే కాకుండా మొత్తం దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీకి కూడా అంత ప్రచారం లభించి ఉండదేమో . వారం పాటు మొదటి పేజీ సింహ భాగం ఆమె పార్టీకే .కేటాయించారు . బాధ్యత మొత్తం మీడియా భుజానికి ఎత్తుకుంది . అమె నెమో తెలంగాణ సాధిస్తాను అని పార్టీ పెట్టింది . ఆమెకేమో తెలంగాణ ను వ్యతిరేకించే మీడియా మద్దతు . ఆమెకు వై యస్ ఆర్ ఆత్మగా గుర్తింపు ఉన్న కెవిపి రామచంద్రరావు ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం . తెరాస నుంచి గెలిచి కాంగ్రెస్ కు అనుబంధంగా పని చేస్తున్న శాసన సభ్యులు జగ్గారెడ్డి తరుచుగా తల్లి తెలంగాణ అధ్యక్షురాలు విజయశాంతి ఆఫీస్ లో కనిపించేవారు . సరే బయట ఎలా ఉన్నా లోపల పార్టీ పని చేసేది తెలంగాణ వాళ్లే అయి ఉంటారు అని ఓసారి వెళ్ళాను . ఆ రోజు ఆమె పుట్టిన రోజు వెళ్ళాక తెలిసింది . అక్కడున్న బొకే నుంచి ఓ గులాబీ పూవు తీసి ఇచ్చి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పాను . ఎన్నికల ప్రచారం కోసం కొందరు పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు . పలకరిస్తే గుంటూరు నుంచి తెలంగాణ పాటలు పడేందుకు వచ్చిన ఉపాధ్యాయులం రిహార్సల్స్ చేస్తున్నాం అన్నారు . బాగుంది అనుకోని విజయశాంతిని ఏమడిగినా ఆమె పక్కనున్న భర్త శ్రీనివాసరావు సమాధానాలు చెబుతున్నారు . ఆమె నోరుమెదపలేదు . ఇంత దాకా వచ్చినందుకు ఏదో మాట్లాడించాలి అని ప్రయత్నిస్తే తెలంగాణ ను విముక్తి చేస్తాను అన్నారు . ఆఫీస్ కు వచ్చి తెలంగాణను తరువాత విముక్తి చేద్దువు కానీ ముందు ఆ శ్రీనివాసరావు నుంచి విముక్తి సాధించండి అని రాశాను . అధ్యక్షురాలిని ఏమడిగినా ఆయనే సమాధానం చెబుతున్నారు అని .... మరోసారి కలిసినప్పుడు గుర్తు పెట్టుకొని ఏమండీ అలా రాశారు అని అడిగారు . తాట తీస్తారు అని మీరు రోజూ అంటారు కదా ? ఈ మాట తెలంగాణ లో ఏ జిల్లాలో అంటారు అని అడిగాను.. అదేంటీ ఆ మాత్రం తెలియదా ? అన్నట్టు చూసి నేను చాలా సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడేప్పుడు అన్నాను అని చెప్పారు . పార్టీ నడపడం ఆంధ్రజ్యోతి మొదటి పేజీ ఆక్రమించినంత ఈజీ కాదు అని గ్రహించి తెరాస లో విలీనం చేశారు . తరువాత కాంగ్రెస్ , బీజేపీ అంటూ అటూ ఇటు తిరిగి ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు . ఆమె బీజేపీలో ఉన్నారు అని అంత కరెక్ట్ గా చెబితే నాకు గొప్ప జ్ఞాపక శక్తి ఉందని అపోహ పడకండి . పార్టీ తన సేవలు ఉపయోగించుకోవడం లేదు అని అధ్యక్షుడిని ఇటీవల ఆమె విమర్శించారు . దాని వల్ల గుర్తుంది పోయింది . ****** ఇక కోదండరాం ను సీఎంగా ప్రాజెక్ట్ చేయడానికి సర్వం సిద్ధం అయిన తరువాత ఇప్పుడే వద్దు ముందు మహాకూటమిని ఫోకస్ చేద్దాం అని మహాకూటమిని ఓట్లు లెక్కింపు మొదలైన తరువాత కూడా మెజారిటీ సీట్లు ఇచ్చారు . ఐతే ఎలక్షన్ కమిషన్ ఫలితాలు వేరుగా ఉన్నాయి . కోదండరాం సొంత పార్టీ పెట్టినప్పుడు కోదండరాం కూడా ఉహించనంత ప్రచారం కల్పించారు . తెరాస నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టినా ఆకాశానికెత్తారు . పత్రికల్లో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు అనే రాస్తారు వారు పార్టీ పెడుతున్నట్టు చెప్పినా భుజానికెత్తుకున్నారు . ఉద్యమ సమయంలో గద్దర్ పార్టీ , ఇంటి పార్టీ ఇవి గుర్తున్నవి మాత్రమే ఇంకా ఎన్నో పార్టీలు వాటికీ మంచి ప్రచారం కల్పించారు . అదేం హస్తవాసో అవన్నీ కాల గర్భంలో కలిసి పోయాయి . ఆంధ్ర లో తెలంగాణ లో మీడియా అండగా నిలిచినా పార్టీలు కనుమరుగు అవుతుంటే , మీడియా వ్యతిరేకించిన పార్టీలను జనం ఆదరిస్తున్నారు . మీడియా మేనేజ్అం మెంట్టే కు నచ్చింది తెలుగు ప్రజలకు నచ్చడం లేదు . ఇదేం శాపమో ... ***  దీవించడం వల్ల మటాష్ అవుతున్నారా ? మటాష్ అయ్యే పార్టీలను దీవిస్తున్నారా ? అని ప్రశ్నిస్తే , ఏమో తెలియదు ... 

31, మే 2023, బుధవారం

ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని... ఖరీదైన జీవిత పాఠం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38 --------------------

ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని... ఖరీదైన జీవిత పాఠం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38 ---------------------------------------------- ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని సమంత అడిగితే పాపం అమాయకురాలు అనిపించింది . ఊహు అని ఎవడంటాడు .. ఊ అనే అంటాడు కదా ? మేం అన్నాం ... ఇప్పుడు కాదు మూడున్నర దశాబ్దాల క్రితం . మేం అంటే నన్ను నేను గౌరవించుకోవడం కాదు . నేనొక్కడినే కాదు ఇంకో ముగ్గురం ఊహు అన్నాం . అబ్బా ఎంత పొరపాటు చేశాం అలా అని ఉండాల్సింది కాదు అని మా అమాయకత్వాన్ని తలుచుకొని మేమే నవ్వుకుంటాం . మా ఊహు విలువ ఒక్కొక్కరికి రెండు వేల కోట్లు . ఔను నిజం ***** ఏడాది క్రితం కా కాలనీ ప్రెసిడెంట్ హై టెక్ సిటీకి దగ్గర అని రెండు కోట్ల రూపాయలతో ఓ ఫ్లాట్ కొన్నాడు . గృహ ప్రవేశానికి పిలిస్తే ... డ్రైవర్ కు అడ్రెస్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటే . వెళ్లి ... వెళ్లి ఓ చోట ఆపి అడ్రెస్ చూస్తున్నాడు . ఎదురుగా చూస్తే తెల్లాపూర్ అని బోర్డు కనిపించింది . మెదక్ జిల్లాలో కూడా ఓ తెల్లా పూర్ ఉంది అని డ్రైవర్ కు చెబితే అతను అలానే నా వైపు చూస్తూ సార్ ఇది మెదక్ జిల్లాలోని తెల్లాపూర్ నే మనం వచ్చింది మెదక్ జిల్లా తెల్లా పూర్ కే అన్నాడు . ***** 1988-89 ప్రాంతం లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి స్టాప్ రిపోర్టర్ ను . తెలుగు విశ్వవిద్యాలయం పి ఆర్ ఓ గా చేసి రిటైర్ అయిన చెన్నయ్య (ఈనాడు , మురళీ ధర్ శర్మ ( ఆంధ్ర జ్యోతి ) ఇంకో రిపోర్టర్ ఉండేవారు . జేసీ మహంతి అని ఒరిస్సాకు చెందిన ఐఏఎస్ జిల్లా కలెక్టర్ . తెగ ఉత్సాహంగా పని చేసే వాళ్ళం . ఉమ్మడి రాష్ట్రం లో అప్పుడు తొలిసారిగా తెల్లాపూర్ లో డ్రిప్ ఇరిగేషన్ మొదలు పెట్టారు . అక్కడ పూల తోటలు పెంచడానికి కలెక్టర్ చాలా ప్రోత్సాహం అందించారు . మీరు యువకులు జీవితం గురించి మీ అవగాహన తక్కువ . మీరు చేసేవి ప్రైవేటు ఉద్యోగాలు.. ఉద్యోగానికి , జీవితానికి భద్రత ఉండదు . మీకు ఒక్కొక్కరికి తెల్లాపూర్ లో ఐదెకరాల భూమి ఇస్తాను . మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూనే పూల తోటలు పెంచండి అని కలెక్టర్ సలహా ఇచ్చారు . అప్పుడు భూములు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్ లకు ఉండేది . ఆయన చెప్పగానే అందరం ఊహు .. అన్నాం . భూములు తీసుకుంటే ఆఫీస్ లో తెలుస్తుంది , ఉద్యోగాలు పోతాయి అని బయటకు చెప్పక పోయినా అందరి భయం అదే . అప్పుడు దాదాపు అందరికీ 900 నుంచి 11 వందల రూపాయల జీతం . ఆ ఉద్యోగం పోతే ఇంకేమన్నా ఉందా ? అనుకున్నాం . 87 లో ఆంధ్రభూమిలో జొన్నలగడ్డ రాధాకృష్ణ నన్ను ఉద్యోగంలో నియమించారు . జిల్లాకు వెళ్లేప్పుడు జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇస్తారు తీసుకో అని చెప్పారు కానీ , వ్యవసాయ భూమి ఇస్తా అంటే ఏం చేయాలో చెప్పలేదు . జేమ్స్ బాండ్ 007 లెవల్ లో అసలు కలెక్టర్ మనకు వ్యవసాయ భూమి ఎందుకు ఆఫర్ చేశారు . ఇందులో ఏమైనా కుంభకోణం ఉందా ? అని మాలో కొందరు పరిశోధన మొదలు పెట్టి , డ్రిప్ ఇరిగేషన్ లో ఏదో ఉండే ఉంటుంది అనుకుని సంతృప్తి పడ్డాం . బహుశా కలెక్టర్ మీ కర్మ అనుకోని ఉండొచ్చు . తరువాత ఆయన విదేశాల్లో శిక్షణ కోసం వెళ్లారు . ***** డ్రైవర్ ఇది మెదక్ జిల్లా తెల్లాపూర్ అనగానే అవన్నీ గుర్తుకు వచ్చాయి . అక్కడ పూల తోటలు లేవు . ఆకాశమంత ఎత్తులో అపార్ట్ మెంట్స్ ఉన్నాయి . మొక్క మహా వృక్షమై భూమి నుంచి ఆకాశాన్ని ముద్దాడి నట్టు కాంక్రీట్ జంగల్ లో ప్రతి భవనం ఆకాశానికి కన్ను గురుతుందేమో అనిపించేంత ఎత్తులో భవనాలు ... ఒక్క ఫ్లాట్ కే రెండు కోట్లు అంటే ఐదెకరాలు వెయ్యి కోట్లు , అపార్ట్ మెంట్స్ నిర్మాణానికి డెవలప్ మెంట్ కు ఇస్తే కనీసం వాటి విలువ రెండు వేల కోట్లు . ఒక్కో రిపోర్టర్ కు రెండువేల కోట్లు అంటే ? కోటి రూపాయల్లో ఎన్ని సున్నాలు ? వెయ్యి కోట్లలో ఎన్ని సున్నాలు ? ఇప్పుడు లెక్కలు బాగానే వస్తాయి కానీ అప్పుడు ముందు చూపు లేకుండే ... *** అంత ఆస్తి చే జారి పోయిందని దిగులు పడుతున్నాను అనుకుంటున్నారా ? అంత లేదు . ఇవన్నీ గాలిలో లెక్కలు . ఒక వేళ ఐదు ఎకరాలు తీసుకుంటే ఉద్యోగం పోయేదేమో , ఐదు ఎకరాలు అప్పుడు అమ్ముకుంటే లక్ష కూడా వచ్చేది కాదేమో . చచ్చి చెడి అమ్మకుండా అలానే ఉంచుకుంటే ఎవడో బకాసురుడు ఆక్రమించుకునే వాడేమో , నా భూమి అంటే హత్య చేసే వాడేమో , ఏమో ఏదైనా జరిగేది . ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటంటే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందనంతగా ఉంటుంది . వర్షం పది నీరు నిలిస్తే ఇదేనా విశ్వనగరం అని టుంరీలు టీవీల్లో హడావుడి చేస్తారు . వర్షం పడితే అమెరికా అయినా హైదరాబాద్ ఐనా అంతే .. ఏ టుంరీ ఏమనుకున్నా హైదరాబాద్ విశ్వనగరమే. రింగు రోడ్డుకు అటా ఇటా అని కాదు ఎటో ఓ వైపు ఇంత స్థలం ఉండడం మంచిది . ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడు కొనలేరు . ప్రజలారా తొందర పడకండి భూమి రిజిస్ట్రేషన్ కు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు దీనితో భూముల ఘోరంగా పడిపోతాయి అని మేధావి మిత్రుడు తెగ ప్రచారం చేశాడు . అతను ప్రచారం చేసినప్పుడు పది లక్షలకు ఎకరం అని చెప్పిన భూమి ఇప్పుడు రెండు కోట్లు . తెలంగాణ ఏర్పడగానే 2014 లో ఎన్ టివి లో గొప్ప స్టోరీ చేశారు . హైదరాబాద్ లో నిర్మాణ రంగం పడిపోయింది . బెంగళూరు వెళ్ళిపోయింది అని బెంగళూరులో జరుగుతున్నా నిర్మాణాలు చూపారు . పిల్లర్ల నిర్మాణానికి కనీసం 21 రోజులు పడుతుంది . కనీసం 21 రోజులు ఆగి ntv ఈ స్టోరీ చేసినా బాగుండేది . తెలంగాణ నిర్మాణం చేసిన క్షణం లోనే అంత పెద్ద నిర్మాణాలు ఎలా జరిగాయో . బయటకు వెళ్లి విచారిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటో తెలుస్తుంది . మీడియా తమ పార్టీలకు అనుగుణంగా వార్తలు వండుతుంది . వాటిని పట్టించుకోవద్దు హైదరాబాద్ లో ఇల్లు అంటే బంగారమే ... ఇక జర్నలిజం అంటే ఏదో దేశాన్ని పొడిచేద్దాం , ఉద్దరించేద్దాం అనే భ్రమలు వద్దు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జర్నలిస్ట్ కూడా ఆరు దశాబ్దాల క్రితమే చెప్పారు . సబ్బుల వ్యాపారం లాంటిదే జర్నలిజం అని . వారు ఆరు దశాబ్దాల క్రితం గ్రహించిన దానిని మనం ఇప్పటికైనా గ్రహించక పోతే ఎలా ? ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పార్టీల మీడియా కాలం ఇది .

ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది . ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37

ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది . ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37 ------------------//////----------- జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానం లో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు . వన భోజనాలు , సమావేశాలుల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది . అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ? ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను అధికారి చెంపదెబ్బ కొట్టడమా ? ఔను చెంపదెబ్బ కొట్టడం ... అందులోనూ టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ... ఇద్దరు సీఎంలు ఆదరించారా ? ఔను చంద్రబాబు ,వై యస్ జగన్ మోహన్ రెడ్డి ... ఒకే సారి కాదు ఒకరి తరువాత ఒకరు అభిమానం చూపించారు . 95 ఆగస్టులో ఎన్టీఆర్ చైతన్య రథం పై పార్వతి తో కలిసి వైస్రాయ్ హోటల్ కు వచ్చారు . లోపలి వెళ్లి తమ్ముళ్ళతో మాట్లాడాలి అనుకున్నారు . కనిపిస్తే చాలు కాళ్ల మీద పడి పోతారు . ఉపన్యాసం ఇస్తే కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతారు అనుకోని ఉండ వచ్చు . కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ లా కళాకారులు కాదు . ఎన్టీఆర్ తన వాహనం తో పాటు వైస్రాయ్ లోకి రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు . ఇంద్రారెడ్డి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకొని తోసేశారు . నేను ఇంకా హోం మంత్రినే అని ఇంద్రారెడ్డి పోలీసులకు చెబుతున్నాడు . అక్కడ ముఖ్యమంత్రినే ఆపేశారు , హోం మంత్రి ఓ లెక్కనా అని అంత ఉద్రిక్త పరిస్థితి లోనూ నవ్వు వచ్చింది . అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పరిటాల రవి గేటు తోసుకొని లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు . అక్కడ ఉన్న పోలీసు అధికారి ఇక్భా ల్ పరిటాల రవిని చెంప దెబ్బ కొట్టి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు . ప్రభుత్వం పడి పోయిన కీలక సంఘటన లో ఇది భాగమే కానీ ప్రత్యేక వార్తగా నిలువ లేదు . మొత్తం వార్తలో ఓ వ్యాఖ గానే కవర్ అయింది . ***** అనంతరం చంద్రబాబు సీఎం గా కుదురుకున్న తరువాత ఇక్బల్ ను తన సెక్యూరిటీ అధికారిగా నియమించారు . చెంపదెబ్బ కొట్టినప్పటి నుంచి ఇక్బల్ దశ తిరిగింది . బాబు ది యూస్ అండ్ త్రో పాలసీ వాడుకుని వదిలేస్తారు అంటారు కానీ కీలక సమయం లో తనకు అండగా నిలిచిన అధికారులు , మీడియా వామ పక్షాల నాయకుల సహాయం ఉంచుకోలేదు . సహాయానికి మించిన మేలు చేశారు . ఇక్బల్ కు ప్రమోషన్ కూడా వచ్చింది . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు ... ఆ తరువాత పరిణామాలు , లోపలి వ్యవహారాలు తెలియవు కానీ రాష్ట్ర విభజన తరువాత ఇక్బల్ హఠాత్తుగా ysr కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . జగన్ అతనికి శాసన మండలి సభ్యత్వం కల్పించారు . *** ఒక గృహిణిగా ఉన్న రేణుకా చౌదరి నాదెండ్ల పై చెప్పు విసిరి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్లారు .చెప్పు తో కార్పొరేటర్ టికెట్ వచ్చింది .ప్రచారం లో అప్పటి కాంగ్రెస్ మాస్ లీడర్ పి జె ఆర్ ముందు కారు బానెట్ ఎక్కి తొడ కొడుతూ రారా దమ్ముంటే అని సవాల్ చేసి రాజకీయాల్లో ఎక్కడికో వెళ్లారు . ఈ స్ఫూర్తి తో గత ఏడాది మహానాడులో ఒకరిద్దరు మహిళలు మైకు ముందు తొడగొట్టి సవాల్ చేస్తూ ప్రసంగాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు . ఒక్కో సీజన్ లో ఒక్క చర్య తో పాపులర్ అవుతారు . తొడ గొట్టే టెక్నీక్ అన్ని సార్లు ఫలితం చూప దేమో ... ఇక ఇక్బల్ కు చెంప దెబ్బతో దశ తిరిగింది . ఆ రోజు ఆలా చేసి ఉండక పోతే అందరు పోలీసుల్లా వయసు రాగానే రిటైర్ అయి పెన్షన్ తో కాలక్షేపం చేసే వారు . దెబ్బ తో బాబు దృష్టిలో తరువాత కాలం కలిసొచ్చి జగన్ దృష్టిలో పడ్డారు . ఏమో ఏదో ఓ రోజు మంత్రి కూడా కావచ్చు . *** పరిటాలను తొలిసారి హిమాయత్ నగర్ లో ని టీడీపీ కార్యాలయం లో చూశా . నలుగురైదుగురు రిపోర్ట్రర్ లం ఆయనతో మాట్లాడు తుంటే రెండంచెలుగా మా చుట్టూ లుంగీ బ్యాచ్ ఉంది . ఏదో రాజకీయాలు మాట్లాడుకుంటాం మీరేంటి అంటుకొని నిలబడతారు చిరాగ్గా అని ముందు అన్నా తరువాత తెలిసింది . లుంగీ బ్యాచ్ పరిటాల ప్రైవేటు సెక్యూరిటీ అని ... చివరి వరకు ఎన్టీఆర్ తో ఉన్నారు . ఎన్టీఆర్ ను దించేశాక ఓ రోజు బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం లో అరుగు మీద మాటా ముచ్చట . ఈనాడు రిపోర్టర్ కనిపించగానే మీ రామోజీ సంగతి , ఈనాడు సంగతి చెబుతా అని పరిటాల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు . నేనూ విన్నాను ..ఓ చిన్న పత్రికలో ఈ వార్త వచ్చింది . 2004 లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక . ఓ సారి అసెంబ్లీ ఆవరణ లో పరిటాల కనిపిస్తే ఇది బై ఎలక్షన్ కేసే అని గుంపులో ఒకరు అనడం వినిపించింది . తన ప్రాణాలకు ముప్పు ఉందని పరిటాల కూడా గ్రహించారు . అనంత పూర్పా లో ర్టీ సమావేశం లోనే మొద్దు శీను హతమార్చారు .!బావ కళ్ళల్లో ఆనందం చూడాలి అని టీవీ 9 ఇంటర్వ్యూ లో మొద్దు శీను చెప్పిన డైలాగు ఆ రోజుల్లో పూరి జగన్నాద్ పోకిరి సినిమా డైలాగును మించి పాపులర్ అయింది . కొన్ని సినిమాల్లో మొద్దు శీను డైలాగులను కూడా ఉపయోగించు కున్నారు .

29, మే 2023, సోమవారం

ఎన్టీఆర్ ఉసురు తగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత :: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 36

ఎన్టీఆర్ ఉసు రుతగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 36 ------------------------------------- శత్రువును ఎదుర్కోలేని బలహీన మైన వ్యక్తి నిన్ను దేవుడే చూసుకుంటాడు . నాకు అన్యాయం చేశావు నా ఉసురు నీకు తాకుతుంది అని శపిస్తాడు . శాపాలు నిజం అవుతాయా ? నిజంగా ఉసురు తగులుతుందా ? ఏమో ఇది కూడా దేవుడు ఉన్నాడా ? లేడా ? దయ్యాలు నిజమా ? అబద్దమా ? అనే చర్చ లాంటిది . ఎప్పటికీ కొనసాగే చర్చ . ఎన్టీఆర్ కుటింబీకులు , పార్టీలో సీనియర్ నాయకులు మరణించినప్పుడల్లా ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే మాట వినిపిస్తుంది . ***** జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సమావేశాలు జరిగేవి . సమావేశం జరిగే హాలులో ఎన్టీఆర్ చిన్న విగ్రహం ఏర్పాటు చేసి నివాళి అర్పించి కార్యక్రమం నిర్వహించేవారు . ఒక రోజు ఇలా సమావేశం అని వెళితే టీడీపీ మహిళా నాయకురాలు షంషాద్ బేగం అని నిండా నగలు వేసుకొని వచ్చేది . ఎన్టీఆర్ విగ్రహం వెనుక వైపుకు వెళ్లి కొద్ది సేపు కళ్ళు మూసుకొని తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ మొక్కింది . ఎంత అభిమానం ఉన్నా ఎవరైనా ముందు నుంచి మొక్కుతారు. ఈమె వెనుక నుంచి మొక్కుతుంది అని వింతగా అనిపించింది . వెనుక నుంచి వెన్నుపోటు ఒకే కానీ మొక్కడం కూడా నా ? అనిపించింది . ఆమె పెద్దావిడనే వార్త రిపోర్టర్ నాగేశ్వర్ రావుతో బాగుండేది . ఆమె నగల మీద జోకులేసేవాడు . మీడియా కూర్చున్న వద్దకు వస్తే నాగేశ్వర్ రావు పిలిచి ఏంటి కథ వెనుక నుంచి మొక్కుతున్నారు అని నవ్వుతూ అడిగితే ఆమె సీరియస్ గానే చెప్పింది . మెహిదీపట్నం లో సొంత ఇల్లు , ఎగువ మధ్యతరగతి కుటుంబం . పదవులపై పెద్ద పెద్ద ఆశలు ఉన్నా మహిళా విభాగంలో తప్ప ఏమీ రాలేదు . నాకు ఎన్టీఆర్ ఉసురు తగిలిందేమో అనిపిస్తోంది . జీవితం గొప్పగా ఏమీ లేదు . ఎన్టీఆర్ ఉసురు తగిలి ఇలా ఉన్నాను అనిపిస్తోంది . అన్నగారు నేను తెలియక పాపం చేశాను క్షమించు అని మొక్కుతున్నాను . ఏమో ఇదో నమ్మకం మొక్కితే పోయేదేముంది అని చెప్పుకొచ్చింది . **** ఎన్టీఆర్ఎ కుటుంబ సభ్యులు , పార్టీ , మీడియా పెద్దలు వెన్నుపోటులో తమ తమ పాత్రలు పోషించారు . ఎన్టీఆర్ కుమారుడు , కుమార్తె మనవడు అకాల మరణం , అప్పటి కీలక నేతలు బాలయోగి , మాధవరెడ్డి , లాల్ జాన్ బాషా , ఎర్రం నాయుడు , హరికృష్ణ వంటి వారు ప్రమాదాల్లో మరణించారు . ఈ మరణాలు జరిగిన ప్రతిసారి ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే చర్చ వినిపించేది . మీడియా ఇలాంటి నమ్మకాలను రాయదు కానీ పార్టీ నాయకుల్లో చర్చ అయితే జరిగేది . ఎన్టీఆర్ ను దించడం లో మూడు పత్రికలు కీలక పాత్ర వహించాయి . వాటిలో ఆంధ్రప్రభ , ఆంధ్రజ్యోతి యజమానులు పత్రికలు అమ్ముకున్నారు. వందల కోట్లు విలువ చేసే ప్రభ భూమి కోసమే అప్పుడు యాజమాన్యానికి చెప్పి ఒప్పించి బాబుకు మద్దతు ఇచ్చారు అని ఓ ప్రచారం . ఇప్పటికి ఆ భూమి సమస్య పరిష్కారం కాలేదు . ప్రభను సంతాలియ అమ్ముకోవాల్సి వచ్చింది . అదే విధంగా జగదీష్ ప్రసాద్ బాబుకు అండగా నిలిచినా జ్యోతిని అమ్ముకొని వెళ్లి పోవలసి వచ్చింది . ఇటీవలే ఓ వీడియో చూస్తే రామోజీ రావు నాకు 87 ఏళ్ళు , ఒక్క సారి కూడా ఇలా నా దగ్గరకు రాలేదు . కాల మహిమనో , జగన్ మహిమనో ఇలా జరిగింది అంటూ మంచం మీద దీనంగా పలకడం నమ్మకం ఉన్న వారికి ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం వల్ల అనిపించింది . ఎన్టీఆర్ఉ సురు గురించి ఇదో రకం వాదన ఐతే దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా చూపవచ్చు . ***** ఎన్టీఆర్ ను దించేసిన వారిలో ఎంతో మంది అత్యున్నత స్థాయికి వెళ్లారు . మొత్తం వ్యవహారానికి నాయకత్వం వహించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం లో అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు . పార్టీ పెట్టిన ఎన్టీఆర్ మూడుసార్లు కలిపి ఐదేళ్లు సీఎంగా ఉంటే బాబు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు , ఆంధ్రాలో ఐదేళ్లు సీఎం గా ఉన్నారు . చివరి వరకు ఎన్టీఆర్ కు అండగా నిలిచినా ఇంద్రారెడ్డి ప్రమాదంలో మారణించారు . వెన్నుపోటుకు మద్దతుగా నిలిచిన ఆంధ్ర జ్యోతిని ఓనర్ అమ్ముకుంటే.. రిపోర్టర్ గా మద్దతు ఇచ్చిన వ్యక్తి పత్రికను కొనుక్కొని ఓనర్ అయ్యారు . అప్పుడు కీలక పాత్ర వహించిన రిపోర్టర్ లు అందరు కూడా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్లారు . ఒక్క ఈనాడు మినహా . ఈనాడులో యాజమాన్యమే ప్రయోజనం పొందుతుంది కానీ మిగిలిన పత్రికల్లా రిపోర్టర్ లు ప్రయోజనం పొందే ఛాన్స్ ఉండదు . వైస్రాయ్ క్యాంపు నుంచి ప్రతి క్షణం రాజగురువును కు సమాచారం ఇచ్చిన కీలక రిపోర్టర్ ను బాబు సీఎంగా కుదురుకున్నాక విజయనగరం బదిలీ చేశారు . రాజుల కథల్లో ఇలాంటి సంఘటనలు కనిపించేవి కీలక ఆపరేషన్ లో పాల్గొన్న వారు తరువాత కనిపించక పోవడం . **** దేవుడు దయ్యం , ఉసురు అన్నీ నమ్మకాలే . కొందరు దేవుడు నిజం దయ్యం అబద్దం అంటారు . అలానే ఉసురు అనేది కూడా మూఢ నమ్మకమే అని దేవుడి మీద ఒట్టేసి చెబుతారు . నమ్మకం అయినా మూఢ నమ్మకం అయినా ఎన్టీఆర్ కుటుంబంలోని వారు, పార్టీలో కీలక నేతలు మరణించినప్పుడల్లా , ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే మాట వినిపించింది ...

28, మే 2023, ఆదివారం

ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు:: గుర్తుకొస్తున్నాయి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -35 ___________

ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు గుర్తుకొస్తున్నాయి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -35 ___________ ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత హిమాయత్ నగర్ లోని ఓ బిల్డింగ్ లో కొంతకాలం పార్టీని నడిపించారు . భవనం చిన్నది , తక్కువ గదులు , వచ్చి పోయే వారి సంఖ్య చాలా ఎక్కువ . ఆ బిల్డింగ్ లోనే అందరూ ఉపయోగించే కామన్ టాయిలెట్ లోకి వెళ్ళాను . ఓ మూలకు చూస్తే మనసు చివుక్కు మంది . చదువుకునే రోజుల నుంచి నచ్చిన సినిమా నే తప్ప ప్రత్యేకంగా నచ్చిన నటుడు అంటూ లేరు . మార్నింగ్ షో పాత సినిమాలు తక్కువ ధర టికెట్ తో సినిమా హాలులో ప్రదర్శించేవారు . దాదాపు పాత సినిమా అలా చూసిందే . కత్తి చేతబట్టి యస్ వి ఆర్ , రాజనాల , సత్యనారాయణ వంటి విలన్ల ను చిత్తూ చేసిన అందాల హీరోగానే ఎన్టీఆర్ రూపం మెదడులో ముద్రించి ఉంటుంది .ఆ లాంటి ఎన్టీఆర్ ను ఎంత అవమానకరంగా దించేశారు అనే బాధ ఓ వైపు .. దించేసి కొద్ది రోజులకే ఎన్టీఆర్ ప్రచార ఫోటోలు టాయిలెట్ లో ఓ మూలకు వరుసగా పేర్చి ఉండడం తో చివుక్కు మనిపించి , మౌనంగా వెళ్ళిపోయాను . మనసులో ఏమున్నా రిపోర్టర్ గా నా పని నేను చేయలి . ***** ఫోటో గ్రాఫర్ బాలాజీ అని ఉండేవారు . అక్కడ మూలకు ఫోటోలు ఉంటాయి . ఫోటో తీయి ఎవరికీ చెప్పకు అని కోరాను . మనం ఫోటోలు తీసుకున్నట్టు పార్టీ వాళ్లకు , మిగతా ఫొటోగ్రాఫర్లకు తెలియొద్దు అని వార్నింగ్ . మరో రెండు మూడు రోజులు అయితే ఎన్టీఆర్ జయంతి ఆ రోజు వస్తే బాగుంటుంది అని ... ఆంధ్రభూమి మొదటి పేజీలో టాయిలెట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలతో వార్త సంచలనం . అప్పుటికి ఎన్టీఆర్ వర్గం లో మిగిలి ఉన్న కొద్ది మంది లక్ష్మీ పార్వతి , ఇంద్రారెడ్డి లాంటి వాళ్లు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి ఈ వార్తను ప్రత్యేకంగా ప్రస్తావించారు . ఎన్టీఆర్ పై బాబు వర్గానికి ఉన్న గౌరవం దీనితో తెలుస్తుంది అని విమర్శించారు . ఎన్టీఆర్ ఫోటోలు తీసుకువెళ్లి అక్కడ పెట్టండి అని బాబు చెప్పాడు అని నేను అనుకోవడం లేదు . కానీ దైవంగా అప్పటివరకు పూజలు అందుకున్న నాయకుడిని ఒక్క సారి దించేసి కిందపడేసిన తరువాత అక్కడ పనిచేసే అటెండర్ కూడా అలానే చూస్తాడు . ఆ ఫోటోలు అక్కడ పెట్టడంలో అతనికి తప్పేమీ అనిపించదు. రాజకీయంగా ఎన్టీఆర్ బొమ్మను మళ్ళీ ఉపయోగించుకునే రోజులు వస్తాయని అక్కడి అటెండర్ లాంటి సామాన్యుడికి ఆలోచన ఎందుకు వస్తుంది . పత్రికలో వార్త రాగానే తీసేశారు . ***** బాబు చేతికి పగ్గాలు వచ్చిన తరువాత మొదట్లోనే ఒకదాని తరువాత ఒకటి ఎన్టీఆర్ గుర్తులు చెరిపేయాలి అని ప్రయత్నించారు . ఎన్టీఆర్ బతికి ఉండగానే బాబు సీఎంగా గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది , ప్రజలు పనితీరుచూసి ఆదరిస్తారు అన్నారు పార్టీ సభ్యత్వ రుసుం రసీదుపై ఎన్టీఆర్ ఫోటో ఉండేది . బాబు పార్టీ అధ్యక్షుడు అయిన మొదట్లోనే ఎన్టీఆర్ ఫోటో తొలగించి చంద్రబాబు తన ఫోటో ముద్రించారు . హరికృష్ణ అభ్యన్తరం వ్యక్తం చేశారు . ఇప్పటికీ బాబు ఫోటోనే ఉంది సూర్యుడు పుట్టినప్పటి నుంచి మే నెలలో ఎండలు ఉంటాయి . నిజానికి మే లో ఎండలు కాదు . ఎండలు ఉండే కాలానికే మనం మే అని పేరు పెట్టుకున్నాం . మే 27,28,29 న మహానాడు జరుగుతుంది . తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి , అంటే ఎన్టీఆర్ హయం నుంచి కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజున మహానాడు జరుగుతుంది . . ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున జరిగే మహానాడు తేదీలు మార్చాలి అని ప్రయత్నించారు . ఒక సంవత్సరం మహానాడు మేలో నిర్వహించలేదు . దానికి ఈనాడులో పెద్ద వార్త రాయించారు . మే లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మే లో మహానాడు నిర్వహించవద్దు అని నిర్ణయం అని వార్త . ఆ తరువాత మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఎన్టీఆర్ ను ముందుకు తీసుకువచ్చి ఏకంగా దేవుడిని చేశారు . ***** బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారు , హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు , సత్యనాదెళ్లను చదివించారు అని గట్టిగా నమ్మే టీడీపీ ఐటీ తరం కుర్రాళ్ళు కొందరికి ఈ విషయాలు ఏమీ తెలియవు . బాబు తో ఏదో గట్టు పంచాయతి ఉండి రాస్తున్నాను అనుకోని కామెంట్స్ పెడితే ఒక్క క్షణం అనిపిస్తుంది . రాయడం అవసరమా ? అని అలా అనుకున్న సమయం లోనే ఉదయం మాడభూషి శ్రీధర్ ఫోన్ చేసి ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు చాలా సంతోషం కలిగించాయి . వారు కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషన్ , న్యాయ నిపుణులు , విద్యార్థులకు న్యాయ పాఠాలు బోధించే ప్రొఫెసర్ . ఆనాటి జ్ఞాపకాలు బాగారాస్తున్నారు . రాయండి నేను అప్పుడు లా పాఠాలు బోధించే లెక్చరర్ గా ఉంటూ కూడా వైస్రాయ్ హోటల్ వద్దకు రోజూ వచ్చేవాడిని . మీరు రాసినవి నేను కళ్ళతో చూశాను . న్తర్కు జరిగిన అన్యాయం చూసి చాలా బాధవేసింది . కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో అప్పుడు నేను చూసినవి రాశాను . మీ రాతలు అవన్నీ గుర్తు చేస్తున్నాయి అన్నారు . ఆరోగ్య సమస్య వల్ల కొన్ని రోజుల నుంచి ఎక్కువగా మాట్లాడలేక పోతున్నారు .ఐనా దాదాపు పదిహేను నిమిషాలు కష్టపడి మాట్లాడారు . పూర్తిగా కోలుకొని మాట్లాడేందుకు, రాసేందుకు నాకు ఇంకా రెండేళ్లు పట్టవచ్చు అప్పుడు న్యాయ కోణం లో రాస్తాను అని . ఎన్టీఆర్ కు ఎవరెవరు ఏ విధంగా అన్యాయం చేశారో మాట్లాడ సాగారు . అప్పుడు అనిపించింది వెన్నుపోటులో భాగస్వాములుగా ఉండి ఆర్థికంగా ఎంతో బాగుపడిన వారే నీతులు చెబుతూ రాస్తుంటే మౌనంగా ఉండడం , రాయక పోవడం అన్యాయం అనిపించింది . *** ఎంత కాలం ? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారే ఎన్నికల కోసం ఆయనకు దేవుడి రూపం కల్పించి ఓట్లు అడగడం ఉన్నంత వరకు వెన్నుపోటు గురించి రాస్తూనే ఉంటారు ... ( వేటపాలెం గ్రంథాలయం అందుబాటులో ఉన్న వారు 1996 మేలో ఆ ఫోటోలు వచ్చిన ఆంధ్రభూమి ఫోటో సంపాదిస్తే కృతజ్ఞతలు )

27, మే 2023, శనివారం

సకుటుంబ వెన్నుపోటు .. ^ ఇప్పుడు రాస్తున్నారు .. మరి అప్పుడెందుకు రాయలేదు ^ :: జర్నలిస్ట్ జ్ఞాపకం _________________

_________ `వెన్నుపోటు అని ఇప్పుడు రాస్తున్నారు . మరి అప్పుడెందుకు రాయలేదు ? మీ జర్నలిస్ట్ లంతా బాబు వైపే ఉన్నారు కదా ? ` అప్పటి జ్ఞాపకాలను రాస్తుంటే ఒకరు వ్యక్తం చేసిన సందేహం . 95 సంఘటన పై MIC టీవీ లో ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్న అడిగారు . 90 శాతం మీడియా బాబు వైపే ఉన్నప్పుడు బాబు కోరుకున్నట్టుగానే మీడియాలో కవరేజ్ వస్తుంది . బాబు కోరుకున్నట్టు ఒక దుష్ట శక్తిపై బాబు సాధించిన విజయంగానే మీడియా చిత్రీకరించడం సహజం . ఐతే నేను ఇప్పుడే కాదు అప్పుడు కూడా వెన్నుపోటు అనే రాశాను . నా గొప్పతనం అని చెప్పడం లేదు . ఆంధ్రభూమిలో అప్పుడు నాకు లభించిన వకాశం జర్నలిస్ట్ మిత్రులు బుద్ధవరపు రామకృష్ణ వేటపాలెం గ్రంధాలయం నుంచి ఆగస్టు వెన్నుపోటుకు సంబంధించి అప్పటి అన్ని పత్రికల ఫోటోలు తీసుకున్నారు . ఆంధ్రభూమి కి సంబంధించి మొదటి పేజీ ఫోటోలు ఇచ్చారు . అప్పుడు ఎందుకు రాయలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాను కానీ అప్పటికప్పుడు ఆధారం చూపలేను కదా ? రామకృష్ణ పంపిన ఫొటోల్లో చూస్తే అల్లుడు ఒక్కరి వెన్నుపోటు కాదు , సకుటుంబ వెన్నుపోటు అని మొత్తం కుటుంబం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది నేను రాసిన వార్త 26 ఆగస్టు 1995 ఆంధ్ర భూమి లో కనిపించింది . ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం , పత్రికా స్వేచ్ఛ వీటి మతలబు బాగానే తెలుసు . మీడియా స్వేచ్ఛ అంటే పెట్టుబడి పెట్టిన యజమాని స్వేచ్ఛ కానీ వార్తలు రాసే జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కాదు . తన మిత్రుడి అవినీతిని ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించే రోజులు ఇవి . సుప్రీం కోర్ట్ తీర్పును కూడా పక్కన పెట్టి ఢిల్లీ పై ఆర్డినెన్స్ తో అధికారం చెలాయిస్తున్న కాలం . ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన పాలకులే ఇలా ఉంటే .. తమ డబ్బు పెట్టుబడి పెట్టి , ఉద్యోగులకు జీతాలు ఇచ్చి లాభం కోసం పత్రిక నడిపే యజమానులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పత్రిక నడుపుతారు కానీ , న్యాయం , ధర్మం , పత్రికా స్వేచ్ఛ వంటి పడికట్టు పదాల కోసం పత్రిక నడపరు . ఐతే తమది వ్యాపారం , మాకు లాభం వచ్చేట్టు నడుపుతాం అని నిజాయితీగా ఒప్పుకోరు నిజాయితి , నీతి , పత్రికా స్వేచ్ఛ , ప్రజాస్వామ్యం అనే పడికట్టు పదాలను వాడుతూ పత్రికా వ్యాపారం నడుపుతారు . అప్పుడు మెజారిటీ మీడియా బాబు కోసం, బాబు చేత అన్నట్టుగా నడిచాయి . మిగిలిన పది శాతం లో ఆంధ్రభూమి స్వరం చిన్నది . అంతమందికి వినిపించే అవకాశం లేదు . అప్పటి వ్యవహారం లో మేజర్ మీడియా ఎన్టీఆర్ ను దించేయడం , బాబు ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు పెంచడం లో క్రియాశీలక పాత్ర వహించింది . ఆంధ్రభూమి యాజమాన్యం అస్సలు పట్టించుకోలేదు . ఎడిటర్ కు వదిలేసింది . యాజమాన్యం ది విచిత్రమైన తత్త్వం . నమ్మితే పత్రిక ఓనర్ ఎడిటర్ నే అన్నంత గౌరవం ఇస్తారు . ఎవరు చెప్పినా వినరు . ఒక్కసారి నమ్మకం పోయింది అంటే గేటు బయట నుంచి అటు నుంచి ఆటే పంపిస్తారు . లోపలి వచ్చి ఛాంబర్ లో సొరుగు సర్దుకునేంత అవకాశం కూడా ఇవ్వరు . ముందుగా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు భూమి వారి దృష్టికి రాలేదో మరేంటో కానీ ఆంధ్రభూమిలో వెన్నుపోటుపై స్వేచ్ఛగా రాసుకునే అవకాశం ఉండేది . కాంగ్రెస్ పేపర్ అని ఠక్కున అనేస్తారు .డీసీ యజమాని , ఆంధ్రజ్యోతి యజమాని ఇద్దరూ గతం లో కాంగ్రెస్ తరపున రాజ్య సభ సభ్యులుగా ఉన్న వారే . కాంగ్రెస్ రాజ్యసభ సభ్యునిగా డీసీ యజమాని ఉండేవారు , ఆంధ్ర జ్యోతి యజమాని ఉండేవారు . ఐతే జ్యోతి టీడీపీని భుజాన వేసుకుంది . డిసి యాజమాన్యం ఎన్నో కీలక సందర్భాల్లో వైయస్ ఆర్ కు , msr కు వ్యతిరేకంగా , టీడీపీకి అనుకూలంగా రాసింది . ఆ వివరాలు మరోసారి . 95 ఆగస్టు లో ఆంధ్రభూమి ఇచ్చిన స్వేచ్ఛను నేను పూర్తిగా ఉపయోగించుకున్నాను . స్వేచ్ఛ ఇచ్చినా ఉపయోగించు కోలేని వారిని చూశాను . ఆగస్టు సంక్షోభం అయినా , తెలంగాణ ఉద్యమం ఐనా అనుమతించిన మేరకు స్వేచ్ఛను జర్నలిస్ట్ గా ఉపయోగించుకున్నాను . నా జీవితంలో అదో గొప్ప సంతృప్తి . ఒక సీనియర్ దాదాపు 20 ఏళ్ళ తరువాత వెన్నుపోటు అని ఓ వ్యాసం లో రాస్తే నేను 95లోనే రాశాను అని గుర్తు చేశా ... వెన్నుపోటుకు నెల ముందు మీడియాలో విపరీతంగా ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతికి వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి . బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ మిత్రుడితో ఈ అంశం పై అప్పుడు మాట్లాడితే మీడియా బాధితుడి వైపు ఉండాలి . అందుకే ఆ రాతలు అన్నారు . వాదన బాగానే ఉంది అనిపించింది . ఎన్టీఆర్ ను దించేశాక , ఇప్పుడు ఎన్టీఆర్ బాధితుడు కదా మరి ఇప్పుడు మీడియా ఎన్టీఆర్ వైపు ఉండాలి కదా ? బాబు వైపే ఉందేమిటి అని అడిగాను . గతంలో అయన వాదన గుర్తు చేస్తూ ... మిత్రుడు భుజం తట్టి రాజకీయాల్లో తమకు అనుకూలంగా ఉండే అనేక వాదనలు ఆ సమయానికి అనుకూలంగా ఉండేవి వినిపిస్తారు అని నవ్వారు . చంద్రబాబు ఒక్కరే కాదు దగ్గుబాటి , ఎన్టీఆర్ కుమారులు , కుమార్తెలు అందరూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు అని సకుటుంబ వెన్నుపోటు అని రాశాను . ఎన్టీఆర్ కుమార్తె పురంద్రేశ్వరీ అప్పుడు దగ్గుబాటి ని ప్రోత్సహించి బాబు శిబిరంలోకి పంపించారు అని ప్రచారం . ఓ వ్యాసంలో ఈ మాట నేను అప్పుడు రాస్తే ఫోన్ చేసి , మిమ్ములను ఖండించమని అడగడం లేదు . మీకు విషయం తెలియాలి అని చెబుతున్నాను . ఆమె వెళ్ళమని నన్ను ప్రోత్సహించలేదు . నేనే నిర్ణయం తీసుకున్నాను . తండ్రి పరిస్థితిపై ఆమె బాధపడ్డారు అని చెప్పారు . ఇది మీరు రాయాలి అని చెప్పడం లేదు . మీకు వాస్తవం తెలియాలి అని చెబుతున్నాను అన్నారు . ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన మొత్తం కుటుంబం ఇప్పుడు ఎన్టీఆర్ దేవుడు , పండుగ చేసుకోండి పూజించండి అని పిలుపునిస్తోంది . దేవుడు కాదు అని కోర్ట్ కు వెళ్లిన చిన్న నటిని మా నుంచి బహిష్కరించి పొట్టకొడుతున్నారు . దేవుడు కాదు అన్నందుకే మా నుంచి తరిమేసిన ఈ సినీ పెద్దలు వెన్నుపోటులో ఎన్టీఆర్ కు కాదు బాబుకు అండగా నిలిచారు .

26, మే 2023, శుక్రవారం

మోడీని దారిలో ఆపాను .. ... ఆశ్చర్య పోయారు... జర్నలిస్ట్ జ్ఞాపకం

మోడీని దారిలో ఆపాను .. ... ఆశ్చర్య పోయారు... జర్నలిస్ట్ జ్ఞాపకం --------------------------- మోడీని దారిలో ఆపి .... ఒక్క నిమిషం ఆగు ... ఏ మోడీ ?.. నిరవ్ మోడీనా ? కాదు ... మరి లలిత్ మోడీనా ? హే.. కాదు ... నరేంద్ర మోడీ నే .. కలలోనా ? కాదు ... నిజం ... తొమ్మిదేళ్లయినా ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు . మీడియాతో మాట్లాడరు .. ఏ మీడియా ఐనా వ్యతిరేకంగా రాస్తే , మాట్లాడితే మిత్రుడు ఆ మీడియాను కొనేస్తారు . కోపం తెప్పించారని NDTV లాంటి మీడియానే కొనేశారు . అలాంటిది .. నువ్వు ఆంధ్రభూమి రిపోర్టర్ గా ప్రధాని నరేంద్ర మోడీని దారిలో ఆపేసి మాట్లాడాను అంటే మేం నమ్మాలి . నేను ప్రధాని నరేంద్ర మోడీని ఆపాను అని చెప్పలేదు . నరేంద్ర మోడీని ఆపాను అని చెప్పాను . అది కాదు కానీ NDTV లో మహిళా జర్నలిస్ట్ జాకబ్ రాజీనామా ఉదంతం పై మోడీని ఆపిన సంఘటన గుర్తుకు వచ్చింది . మహిళలకు మోడీ ఎంత గౌరవం ఇస్తారు అనే స్టోరీ చేయమని చెబితే - ఆ వివాదం తో 20 ఏళ్ళ ఉద్యోగానికి జాకబ్ రాజీనామా చేశారట . రాజకీయాల్లో ఐనా , మీడియాలో నైనా , చివరకు మన జీవితంలో నైనా తెరవెనుక జరిగింది అంతా బయటకు రాదు . కారణం బయటకు చెబుతున్న దైనా కావచ్చు , చెప్పనిదైనా కావచ్చు ఆమె రాజీనామా నిజం , మోడీ మహిళలకు గౌరవం ఇస్తారనే స్టోరీ NDTV లో రావడం నిజం . మోడీని దారిలో నిలిపాను అని చెప్పి మళ్ళీ ఎక్కడికో వెళుతున్నావు ... ముందు ఆ విషయం చెప్పు .. సరే అక్కడికే వస్తాను . ***** 2004-05 లో హై టెక్స్ కన్వెన్షన్ హాలులో ప్రవాసీ భారతీయ దివస్ జరిగింది . రెండేళ్ల కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంది . వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి పెద్ద కార్యక్రమం . దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరించి పెట్టుబడులు పెట్టాలి అని nri లను కోరే కార్యక్రమం . ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం కాబట్టి వై యస్ ఆర్ ఏర్పాట్లపై ఎక్కువ దృష్టి పెట్టారు . అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు . వైస్సార్ ఉపన్యాసం రొటీన్ గా ఉంది . ఈ సమావేశం లో నరేంద్ర మోడీ ఉపన్యాసం ప్రత్యేకంగా అనిపించింది . అప్పుడాయన గుజరాత్ ముఖ్యమంత్రి .గుజరాత్ గాలిలోనే వ్యాపారం ఉంటుంది . మీరు ఇక్కడి కన్నా విదేశాల్లో అయితే ఎక్కువ సంపాదించవచ్చు అని పుట్టిన దేశాన్ని వదిలి విదేశం వెళ్లిన వారు . ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే పెడతారా ? ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడ పెడతారు . కాబట్టి పెట్టుబడి పెట్టండి అని అడగను . ఈ దేశానికి మీరో సహాయం చేయవచ్చు . మీరు ఏ దేశంలో అన్నా అక్కడి వారికీ ఇండియాలోని పర్యాటక ప్రదేశాల గురించి చెప్పండి . ప్రవాస భారతీయులు ఒక్కొక్కరు కనీసం ఐదు మంది ఆ దేశం వారిని ఇండియాకు పర్యాటకులుగా వచ్చేట్టు చేస్తే , ఎంత మంది పర్యాటకులు వస్తారు ? ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుందో నరేంద్ర మోడీ లెక్కలతో ఉపన్యసించారు . ఉపన్యాసం ప్రత్యేకంగా అనిపించింది . **** హై టెక్స్ చాలా విశాలంగా ఉంది .ఆ ప్రాంతంలో మీడియా కెమెరాలు లేవు . సెక్యూరిటీ హడావుడి లేదు . అప్పుడు ఆంధ్ర జ్యోతిలో పని చేస్తున్న జర్నలిస్ట్ మిత్రుడు వెంకటా చారి (తరువాత జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ) నేనూ ఇద్దరం ఉపన్యాసం విన్నాక హాలులో నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా నరేంద్ర మోడీ ఒక్కరే వస్తున్నారు . గోద్రా అల్లర్లతో అప్పటికే బాగా పాపులర్ . మనకు అవసరం అయిన దానికన్నా ఎక్కువే హిందీ వస్తుంది కదా ? మోడీని పలకరించి చూద్దాం పదా అని ముందుకు వెళ్లి . ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మేం పలానా మీడియా. మీటింగ్ లో మీ ఉపన్యాసం బాగుంది. అని పొగడ్త బాణం వేసాం . అది బాగానే పని చేసింది . మీడియా నన్ను మెచ్చుకుంటుంది కూడానా ? అని మోడీ నవ్వారు . అంతకు ముందు గోద్రా పై మీడియా మోడీని తీవ్రంగా విమర్శించడం తో మీడియా మెచ్చుకుంటుంది కూడానా ? అని ఆశ్చర్య పోతూ నవ్వారు . మాకు కావలసింది మోడీ ని అక్కడ నిలబెట్టడం కాసేపు మాట్లాడి , అవకాశం ఉంటే మంచి వార్త సంపాదించడం . దారిలో మోడీని ఆపడం , కొద్ది సేపు మాట్లాడడం వరకు సక్సెస్ అయ్యాం . రిపోర్టర్ అనే వాళ్ళు తాజా సమాచారం తో సిద్ధంగా ఉంటే ఎవరితోనైనా ఏమైనా , ఎక్కడైనా మాట్లాడవచ్చు . తాజా సమాచారం అంటే సివిల్స్ కు సిద్ధం అయినట్టుగా కష్టపడాల్సిన అవసరం లేదు . ప్రతి రోజు పేపర్ చదివితే చాలు . పేపర్ చదవడం అంటే మనం రాసిన వార్త మనం చదివి అలసి పోవడం కాదు. పేపర్ మొత్తం సంపాదకీయం తో సహా చదవడం . **** దారిలో నిలిపి మోడీ తో మేం ఇద్దరం అలా మాట్లాడుతుండగానే దారికి ఒక వైపు వివిధ రాష్ట్రాల స్టాల్స్ ఉన్నాయి . మాకు దగ్గర లోనే ఉన్న స్టాల్ లో ఓ మహిళను మోడీ , మోడీని ఆ మహిళ ఒకే సారి చూసి పలకరించుకున్నారు . గుజరాత్ కు చెందిన ఆ మహిళ చాలా కాలం విదేశాల్లో ఉన్నట్టు ఉన్నారు . ముఖం లో ఆ మార్పు ఉంది . బాగా మారిపోయారు అంటూ మోడీ అదే విషయం ప్రస్తావిస్తూ ఆ స్టాల్ దగ్గర ఉన్న మహిళ వద్దకు వెళ్లిపోయారు . ఆమెతో మాట్లాడేప్పుడు కొద్ది సేపు నిరీక్షించినా మా వైపు వచ్చే అవకాశం కనిపించక పోవడంతో వెళ్లి పోయాం . మోడీ మహిళలను గౌరవించడం గురించి ndtv స్టోరీ సంగతి ఎలా ఉన్నా ... మా ముందే మా ఇద్దరు రిపోర్టర్లను మాట్లాడుతుండగానే వదిలేసి మోడీ మహిళ వద్దకు వెళ్లారు .

25, మే 2023, గురువారం

దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు - మనిషిగా విజేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు

దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు - మనిషిగా విజేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు ^^ మీరు బాబు గారి తోడల్లుడు . ఆయనేంటో మీకు బాగా తెలియాలి . ఇప్పటి వరకు నేను జిల్లాల్లో పని చేశా , హైదరాబాద్ వచ్చి నెల రోజులు అవుతుంది . బాబు ఏమిటో ఒక్క సారికే నాకు అర్థం అయింది . బాబు ఏంటో మీకు తెలియలేదా ? ఎలా నమ్మారు ^^ దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో నేను మాట్లాడిన మొదటి మాటలు . అయన తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో అలా జరిగిపోయింది అన్నారు . మోసపోయాను అనే బాధ కనిపించలేదు , చిరునవ్వే డామినేట్ చేసింది . 1995లో ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు సీఎం అయ్యాకదగ్గుబాటి ఇంటికి వెళ్లే సరికి ఆయన శాసన సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు . ^^ నిన్నటి వరకు వాళ్లంతా బయటకు వస్తామని అన్నారు . అందరికీ బాబు ఫోన్ చేసి వెళ్ళవద్దు అని చెబుతూ, మీకు మంత్రిపదవి ఇస్తాను, కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి ఇస్తాను అని చెబుతుంటే, అంతా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు .^^ ఇదీ ఆ రోజు దగ్గుబాటి చెప్పిన విషయం . ***** దేవదత్ పట్నాయక్ అని ఓ డాక్టర్ ఉన్నారు . మహాభారతం , రామాయణం వంటి పురాణాల ఆధారంగా ఆధునిక జీవితం మేనేజ్ మెంట్ పై దాదాపు రెండువందల పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు . పలు ఇంగ్లీష్ పత్రికల్లో కాలమ్స్ రాస్తారు . ఓ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన సదస్సులో యాంకర్ చాలా వివరంగా ఓ ప్రశ్న అడిగింది . మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అనేక సార్లు ధర్మ విరుద్ధంగా వ్యవహరించారు . నువ్వు నా కుమారుడివే పాండవులను చంపవద్దు అని కర్ణుడి వద్దకు రాయబారం పంపడం , భీష్ముడి వద్దకు అర్జునుడిని పంపి నువ్వు ఎలా మరణిస్తావు అని రహస్యం తెలుసుకోవడం వంటివి వివరించి , ఇన్ని చేసిన శ్రీ కృష్ణుడిది ధర్మ పోరాటం అని ఎలా అంటారు అని అడిగింది . సుదీర్ఘమైన ప్రశ్నకు పట్నాయక్ సంక్షిప్తంగానే సమాధానం చెప్పారు . మీరు చెప్పినవి కరెక్ట్ కానీ అక్కడ పాండవులు , శ్రీకృష్ణుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారు ? దుర్యోధనుడి వంటి దుర్మార్గుడితో దుర్యోధనుడితో యుద్ధం అలానే చేయాలి . అది ధర్మ విరుద్ధం అని మరోలా చేస్తే పాండవులు ఓడిపోయే వారు కౌరవులు విజయం సాధించేవారు . మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది కూడా యుద్ధ నీతిలో ముఖ్యమైనది అని వివరించారు . ఈ ధర్మ సూక్ష్మం గ్రహించక పోవడం వల్లనే దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల్లో బాబు చేతిలో మోసపోయారు . మోసపోయారు అనడం కన్నా ఓడిపోయారు అనడం సబబు . తాను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఎదుటి వారు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకోవడం అత్యాశే . *** దగ్గుబాటి వెంకటేశ్వర రావు , నారా చంద్రబాబు ఇద్దరూ ఎన్టీఆర్ అల్లుళ్ళు . ఇద్దరిలో ఆర్థికంగా , చదువు పరంగా దగ్గుబాటి ముందున్నారు . పైగా కులానికి సంబంధించిన గ్రేడింగ్ లోనూ దగ్గుబాటి ది ముందువరుస . ఐతే బాబు రాజకీయం ముందు నిలువ లేక పోయారు .ఎన్టీఆర్ ను దించేసిన వైస్రాయ్ క్యాంపు సమయంలో క్యాంపు లో కన్నా దగ్గుబాటి శిబిరం లో శాసన సభ్యుల సంఖ్య ఎక్కువ .దగ్గుబాటి చెప్పడం తో వీళ్లంతా వైస్రాయ్ శిబిరానికి వెళ్లారు . దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి పదవి . రోజూ మనిద్దరం ఒకే కారులో సచివాలయానికి వెళదాం ఇదీ ఇద్దరి మధ్య అలిఖిత ఒప్పందం . సీఎంగా బాబు కుదురుకోగానే ఒకే కారులో వెళ్లడం మాట దేవుడెరుగు పొమ్మనలేక పొగపెట్టాలని దగ్గుబాటి ఫోన్ చేసినా బాబు లిఫ్ట్ చేయలేదు . తన వర్గం తో బయటకు వెళ్ళాలి అని దగ్గుబాటి ప్రయత్నాలు చేస్తుండడం తో పాలేటి రామారావు తప్ప దగ్గుబాటితో ఎవరూ వెళ్లరు అని ఆంధ్రభూమిలో రాశాను . ఆయనకు బాగా కోపం తెప్పించింది . డిసి యజమాని వెంకట్రామ్ రెడ్డి తో పార్లమెంట్ లో పరిచయం . నాపై ఫిర్యాదు . ఎడిటర్ పిలిచి ఓ సారి మాట్లాడి రా అని చెబితే వెళ్ళాను . ఫిర్యాదు చేసినప్పటికీ ఇంటికి వెళితే చాలా మర్యాదగా మాట్లాడారు . చాలా సౌమ్యుడు , ఎదుటి వారికి గౌరవం ఇస్తారు . ఐనా రాజకీయాలకు సంబంధించి నా అభిప్రాయం మారలేదు . ఇంటికి వెళితే అప్పుడు శాసన సభ్యులకు ఫోన్ చేస్తూ కనిపించారు . దగ్గుబాటి ఆశించినట్టు 70 మంది శాసన సభ్యులు రాలేదు , నేను రాసినట్టు ఒకే ఒక mla కాదు . పన్నెండు మంది దగ్గుబాటితో పాటు తిరిగి ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు . లక్ష్మీ పార్వతి ని చూపించి ఎన్టీఆర్ ను దించేసి అధికారంలోకి వచ్చింది బాబు . కానీ బాబు ఒక్కసారి కూడా ఆమెను బహిరంగంగా విమర్శించలేదు . యెర్ర బస్సు అని ఆమెను విమర్సగించింది దగ్గుబాటి , దుష్ట శక్తి అని తిట్టింది హరికృష్ణ . నాయకుడు తిట్టిస్తాడు , తాను తిట్టడు . రాజకీయ నాయకుడు ఇతరులను పని ముట్లుగా ఉపయోగించుకుంటారు కానీ తానె పని ముట్టుగా మారడు . బాబు కరుడుగట్టిన రాజకీయ నాయకుడు . బాబు వెంట వెళ్లి మధ్యలో వదిలేసి ఎలా వస్తారని ఎన్టీఆర్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశం లో ఆంధ్రప్రభ తరపున దేవులపల్లి అమర్ గట్టిగా ప్రశ్నించారు . ఏమీ అనలేక ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు , హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ సాయిబాబాబా తన పక్కన ఉన్న అనుచరుడి చెంప చెళ్ళు మనిపించాడు . ఇదంతా దగ్గుబాటి రాజకీయాల్లో పరాజిత గా .. **** అధికారాంతమున చూడాలి అన్నారు పెద్దలు . విపరీతమైన అధికారం అనుభవించి అధికారం నుంచి దిగిపోయిన తరువాత వారిని చూస్తే జాలి వేస్తుంది . సహజంగా ఉండలేరు . సినిమావాళ్లు , రాజకీయ నాయకులు డిమాండ్ తగ్గినప్పుడు అందరిలోకి రావడానికి ఇష్టపడరు . మందులో మునిగిపోయే నటులు , అజ్ఞాతంలోకి వెళ్లిపోయే నాయకులు ఎంతో మంది . అటు సినిమా గ్లామర్ తో ఇటు రాజకీయాలతో సంబంధం ఉన్న దగ్గుబాటి రాజకీయాలకు స్వస్తి పలికి సాహిత్య జీవితం గడుపుతున్నారు . ఉమ్మడి రాష్ట్రం లో ఎన్టీఆర్ తరువాత రెండు పవర్ సెంటర్ లు ఉండేవి . ఒకటి దగ్గుబాటిలు రెండు బాబు . అప్పుడు పవర్ సెంటర్ అంటే అల్లా టప్పా కాదు . తరువాత కాంగ్రెస్అ లో , బీజేపీలో చేరి రాజకీయాలకు స్వస్తి పలికారు . దశాబ్దాల పాటు అధికార కేంద్రంగా ఉండి రాజకీయాలు వదిలేసి పుస్తకాలు చదువుతూ , పుస్తకాలు రాస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు . ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు - ఆ తరువాత అని చరిత్రను అధ్యయనం చేసి సంక్షిప్తంగా ప్రపంచ చరిత్రను పుస్తకంగా తీసుకువచ్చారు . భగత్ సింగ్ గా నటించేందుకు చాలా కాలం క్రితం దగ్గుబాటి ప్రయత్నించారు . స్టీల్ ఫోటో కూడా విడుదల చేశారు . 95 వెన్నుపోటు పై సినిమా తీసేందుకు 96లో ప్రయత్నించారు . 82 ;ఓ టీడీపీ ఆవిర్భావం నుంచి 95 వెన్నుపోటు వరకు ఆ తరువాత నడుస్తున్న చరిత్ర వరకు దగ్గుబాటి రాస్తే బాగుండు . సాక్షుల కన్నా పాత్రదారులకు నాటకం గురించి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది . దగ్గుబాటి తన కోణం నుంచి ఐనా 95 వెన్నుపోటును రికార్డ్ చేయాలి . ఒక చరిత్ర కొన్ని నిజాలు పేరుతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు 95 నాటి పరిణామాలపై పుస్తకం రాశారు

23, మే 2023, మంగళవారం

ూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు:ఎన్టీఆర్ పయనమెటు ?: జర్నలిస్ట్ జ్ఞాపకం

మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు జర్నలిస్ట్ జ్ఞాపకం "ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూలలో ఉండేవాడిని . మహానుభావుడు ఎన్టీఆర్ వల్ల ఇప్పుడు ఢిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్నాను . ఆయన మహానుభావుడు కానీ ఆయన పిల్లలు ..... ఎన్టీఆర్ ను దించేసేప్పుడు నేనూ కొంత మందిమి బాలకృష్ణను కలిశాం లక్ష్మీ పార్వతిని బయటకు పంపాలి అంటే ఎన్టీఆర్ ను దించేయాలి . ఎన్టీఆర్ ను దించేసి లక్ష్మీ పార్వతి వెళ్ళాక మళ్ళీ సీఎం ను చేస్తాం అని చెప్పాం . మళ్ళీ సీఎం ను చేస్తారు కదా అని అమాయకంగా అడిగాడు .. ఒక సారి దించేశాక మళ్ళీ ఎవరైనా సీఎం ను చేస్తారా ? ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు రామకృష్ణ టాకీస్ లో వారం నిర్వహించాలి అనుకున్నాం వారం పాటు అక్కడ ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఎగ్జిబిషన్ నిర్వహించాలి అని హరికృష్ణను అడిగితే, వారం రోజులా ఇవ్వలేను ఒక్క రోజు ఐతే ఒకే అన్నాడు .." కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సముద్రాల వేణుగోపాల చారి ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో పంచుకున్న విషయాలు ఇవి . ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడం పై వస్తున్న వార్తలు చదివాక ఇది గుర్తుకు వచ్చింది . అది సరే జూనియర్ ఎన్టీఆర్ మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు అంటున్నావు . ఎలా ? ఆ మాట నేనెక్కడన్నాను . మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించింది . జూనియర్ ఎన్టీఆర్ కాదు . చంద్రబాబు . మూడు తరాలను వాడుకున్నది, వారిని యూస్ అండ్ త్రో అని వదిలేసింది బాబు . ఎన్టీఆర్ నటుడు కానీ చంద్రబాబు కల్తీ లేని వందశాతం రాజకీయనాయకుడు . రాజకీయ నాయకుడికి రాజకీయం తప్ప ఇంకేమి ఉండకూడదు . ఒకసారి మోసపోతే మోసం చేసిన వారిది తప్పు . రెండవ సారి మూడవ సారి అలా మోసపోతూనే ఉంటే మోసపోయిన వారిది తప్పు అవుతుంది తప్ప మోసం చేసిన వారిది కాదు . బాబు ఎన్టీఆర్ ను కోలుకోకుండా దెబ్బ కొట్టారు . ఆ దెబ్బకు తట్టుకోక ఎన్టీఆర్ క్షోభ తో పోయారు . ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణను వెన్నుపోటు కన్నా ముందే బాబు రంగం లో దింపారు . అదే హరికృష్ణ బాబు తనను మోసం చేశాడు అని టీడీపీ నుంచి బయటకు వెళ్లి అన్నా తెలుగుదేశం అని ఓ పార్టీ పెట్టి బాబుది యూస్ అండ్ త్రో పాలసీ అని విమర్శించారు . అంతకు ముందు తన తండ్రి మరణం పై విచారణ జరపనందుకు నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు .ఆ తరువాత కూడా వారి కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ బాబు కోసం రంగం లో దిగారు . 2009 లో టీడీపీ , తెరాస కలిసి పోటీ చేశాయి . జూనియర్ బాబు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు . ప్రచారం లో ప్రమాదం ,గాయం . వాహనం లో జూనియర్ బెడ్ పై పడుకొని బాబు తో ఫోన్ సంభాషణ ... టివి లో లైవ్ ... మధ్యలో సంధాన కర్త కొమ్మినేని శ్రీనివాస్ ... ఆరోగ్యం జాగ్రత్త అని బాబు అంకుల్ మీ ఆరోగ్యం జాగ్రత్త అని జూనియర్ ... లైవ్ లో చూసిన వారికి రక్త సంబంధం సీన్ ను మించి రక్తి కట్టించింది .. ఆ ప్రచారం లో జూనియర్ రాజకీయ పంచ్ డైలాగులు అభిమానులను ఉర్రుతలూగించాయి . నువ్వు ఇంకా భ్రమల్లో ఉన్నావు జూనియర్ కోసం జనం గంటల తరబడి వేచి చూస్తున్నారు . నువ్వు ఇంకా కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నావు అని టీడీపీ మిత్రులు మందలించారు . గంటల తరబడి వేచి చూస్తున్నది నిజమే ... దూరం నుంచి చూస్తే చాలు జన్మ ధన్యం అయింది అనుకుంటున్నది నిజం . ఈలలతో యెగిరి గంతులు వేస్తున్నది నిజం ... ఐతే కాంగ్రెస్ గెలుస్తుంది . ఎందుకంటే ఈ అభిమానులు కొత్తగా వచ్చిన వారేమీ కాదు మొదటి నుంచి వారు మీ పార్టీ అభిమానులే . జూనియర్ ను చూసి సంబరపడుతున్నారు అంతే అన్నాను . ప్రచారం ముగిశాక కొద్ది మంది మీడియా వాళ్ళు జూనియర్ ను కలిస్తే - టీడీపీ అధికారం లోకి వస్తుంది . ఐతే తెరాస మద్దతు అవసరం లేకుండా అధికారం లోకి రావాలి అని కోరుకుంటున్నాను అని మనసులోని మాట బయట పెట్టారు . జూనియర్ కోరుకున్నట్టు టీడీపీ కి తెరాస మద్దతు అవసరం పడలేదు . ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నే గెలిచింది . ఆ తరువాత పరిణామాలతో జూనియర్ ను బాబు బృందం దూరం పెట్టింది / జూనియర్ ఎన్టీఆర్ బాబు బృందాన్ని దూరం పెట్టారు . మొత్తం మీద దూరం పెరిగింది . 2014 ఎన్నికల సమయం లో జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు . అందుకే ప్రచారానికి వెళ్లడం లేదు అని ప్రకటించారు . 2009 లో రాజకీయ ప్రసంగాలతో అదరగొట్టిన వారు ఐదేళ్ల తరువాత మరింత రాటు దేలుతారు కానీ అవగాహన తగ్గుతుందా ? రాజకీయ పరిజ్ఞానం తక్కువ అని చెప్పడం ద్వారా తనకు రాజకీయ పరిజ్ఞానం పెరిగిందని నిరూపించారు . ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ దూరంగా ఉండడం చర్చనీయాంశం గా మారింది . తాతయ్య కల , నాన్న కోసం అన్నీ హంబక్ . ఎవరి లెక్కలు వారికి ఉంటాయి . ఈ ఎన్నికల్లో జూనియర్ ప్రచారం చేస్తే టీడీపీ గెలుస్తుంది అనుకుందాం . దాంతో ఆయన కేం లాభం బాబు సీఎం అవుతారు, వారసుడిగా లోకేష్ కు ఎదురు లేదు .టీడీపీ ఈసారి కూడా ఓడి పోతే నాయకత్వ మార్పు పై ఒత్తిడి పెరుగుతుంది . గత ఎన్నికల తరువాత చివరికి బాబు సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ లు చూపి నినాదాలు చేశారు . 2024 లో టీడీపీ ఓడిపోతే ... ఆ తరువాత పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది . పార్టీ తన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది . 2029 నాటికి ఆర్థికంగా , సినిమా ఇమేజ్ పరంగా ఆగ్ర స్థానం లో ఉంటాడు . ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా , చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి విఫలం అయినా , రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం పై వెనకడుగు వేసినా ఈ అన్ని సందర్భాల్లో కాలం ది కీలక పాత్ర . తాత ఎన్టీఆర్ నే మట్టికరిపించిన బాబుకు మనవడు ఎన్టీఆర్ ను దెబ్బ తీయడం పెద్ద కష్టమా ? అనిపించ వచ్చు . నీటిలో ఉన్నంత వరకే మొసలికి బలం . తాతా మనవడు అని కాదు కలిసి వచ్చే కాలం , కలసి రాని కాలం అని కాలం ముఖ్యం . మూడు తరాలను ఉపయోగించుకున్న బాబు ను తక్కువగా అంచనా వేయవద్దు . బాబు అల్లుడు , మామ ,షడ్డకుడు , అన్న ( రామ్మూర్తి నాయుడుకి ) ఇవేవి కాదు ఆయన నిఖార్సైన రాజకీయ నాయకుడు .