24, డిసెంబర్ 2018, సోమవారం

ఇది కేసీఆర్ శతాబ్దం

ఈశతాబ్దం నాది అని సాహి త్యంలో మహా కవి శ్రీశ్రీ ప్రకటించుకున్నారు. తెలుగు సాహి త్యంలో శ్రీశ్రీ ప్రకటింకున్నట్టుగానే తెలుగు రాజకీయాల్లో ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకునే ధైర్యం ఒక కేసీఆర్‌కే ఉన్నది. తెలుగు రాజకీయాల్లో ఈ శతాబ్దం నాది అని సగౌరవంగా ప్రకటించుకునే అవకాశం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. శ్రీశ్రీ కన్నా ముందు, తర్వాత టన్నులకొద్దీ సాహిత్య సృష్టి జరిగింది, జరుగుతున్నది. కానీ ఒక్క మహా ప్రస్థానంతో శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకోగలిగారు. వందేండ్లలో దాదాపు 80 ఏండ్ల పాటు తెలంగాణ ఎన్నో ఉద్యమాలను చూసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నుంచి నేటిదాకా అనేక పోరాటాలు ఈ నేల చూసింది. ముల్కీ ఉద్యమం 1955లోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనానికి వ్యతిరేకంగా సాగింది మొదలు 1969 తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాలు చూసింది. తెలంగాణలో సాగిన ఈ ఉద్యమాల అనుభవాలు, ఫలితాలను అధ్యయనం చేసి 2001లో శ్రీకా రం చుట్టిన తెలంగాణ ఉద్యమం విజయతీరాలను తాకి తెలంగాణ కలను సాకారం చేసింది. ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేయడం ద్వారా కేసీఆర్ ఈ దశాబ్దం నాది అని సగౌరవంగా ప్రకటించుకోవచ్చు.

దేశానికి భూసంస్కరణల ఆలోచన కలిగించిన నేల ఇదే. భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నేల ఇదే. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్ట్టెక్కించి ఆర్థిక సంస్కరణల ద్వారా ఆధునిక భారతానికి దారులు వేసిన పీవీ నర్సింహారావు పాలనా పాఠాలు నేర్చుకున్నది ఇక్కడే. ఇవన్నీ ఈ దశాబ్ద కాలంలోని అపురూప దృశ్యాలు, దేశ గతిని మార్చిన పరిణామాలు. అయితే వందేండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే ఈ దశాబ్దం నాది అని ప్రకటించుకు నే అవకాశం చరిత్ర కేసీఆర్‌కే ఇచ్చింది. వందేండ్ల తెలంగాణ చరిత్ర పరిశీలిస్తే ఈ వందేండ్లు కూడా పలు కీలక ఉద్యమాలతోనే గడిచింది. అయితే వీటిలో 2001లో మొదలైన తెలంగాణ ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. తెలంగాణ సాకారం కావడమే కాదు, ఉద్యమనేతగా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మొద టి గెలుపును సెంటిమెంట్ అనుకుంటే, ఇప్పుడు పాజిటివ్ వేవ్‌తో రెండవసారి ఘన విజయం సాధించారు. 2014లో తెలంగాణ సాకారమైన తర్వాత 63 స్థానాల్లో విజయం సాధిస్తే, 2018లో 88 స్థానాల్లో విజయం సాధించారు. సంక్షేమ పథకాల్లో అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు.

ఆధునిక తెలంగాణకు వందేండ్ల క్రితమే పునాదులు పడ్డాయి. సిర్పూర్ పేపర్ మిల్లు, బోధన్ చెక్కర ఫ్యాక్టరీ, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం స్టేట్ రైల్వే వంటితో నాడే పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే అని ఎన్నికల ప్రచారంలో బాబు అహంకారంతో ప్రకటనలు చేసినా 1920 నాటికే తెలంగాణ లో ఆధునిక తెలంగాణకు పునాదులు పడ్డ విషయం చారిత్రక సత్యం.1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలం గాణ విలీనం తర్వాత ఈ ప్రాంతం అనుభవించిన వివక్ష, అణిచివేతలు అంతా ఇంతా కాదు. అప్పటినుంచి ఏదో రూపంలో తెలంగాణ తన అస్తి త్వం నిలుపుకోవడానికి ఉద్యమిస్తూ నే ఉన్నది. 2014లో ఆ కల నెరవేరింది. ఈ కల సాకారం చేయడానికి జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా కేసీఆర్‌కు ఈ శతాబ్దం నాది అని చెప్పుకునే ఘనతను చరిత్ర కట్టబెట్టింది.1982లో హైదరాబాద్‌లోనే ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఒక సంచలనం. యువతకు రాజకీయాల్లో అవకాశాలు దక్కాయి. ఎన్టీఆర్ గ్లామర్ వల్ల రాజకీయాలు సామాన్యులకు చేరువ అయినా తెలంగాణకు పెద్దగా ప్రయోజనం కలుగలేదు. పైగా 19 83 నుంచే ఆంధ్ర నుంచి బలమైన సామాజికవర్గం హైదరాబాద్‌కు వలస రావడం బాగా పెరిగిపోయింది. తెలంగాణ పల్లె భూములు, హైదరాబాద్ పరిసరాల్లోని విలువైన భూములు ఆ వర్గం చేతిలోకి వెళ్లాయి. వైయస్ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభానికి చేవెళ్లకు వచ్చిన వారు అక్కడి భూములు చౌకగా లభించడం చూసి విస్తుపోయారంటే తెలంగాణ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Kautilya
ఈ పరిణామాలన్నింటి మధ్య పుట్టిన తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడటమే కాదు పాలనలోనూ కొత్త పుంతలు తొక్కుతున్నది. రైతులకు నేరుగా నగదు అందజేయడం విషయంలో దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది. రుణమాఫీ కన్నా నగదు సహాయం అందించే రైతుబంధు మేలు అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. తెలంగాణలో విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు సమాయత్తమవటం ముదావహం.
ఒకప్పుడు ఆర్థిక సంస్కరణల్లో తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు దేశానికి దారిచూపితే, అదే దారిలో ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేసీఆర్ రూపంలో తెలంగా ణ మరోసారి తన ప్రభావం చూపనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు చివరి దశలో ఉన్నది. అది పూర్తయితే సగం తెలంగాణ సమస్యలు తీరుతాయి. ఇప్పుడు నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులు రెండేండ్లలో పూర్తి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో అమలు జరుగుతున్న రైతుబంధు పథకం అందరికీ ఆద ర్శంగా నిలుస్తున్నది. ఈ పథకాన్ని అమలుచేయనున్న ట్టు ఇప్పటికే ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ప్రకటించాయి. నిఖార్సయిన తెలంగాణ రాజకీయాల్లో, పాలనలో మానవీయ కోణం ఉన్నది. అది పీవీ ఆర్థిక సంస్కరణ ల్లో అయినా కేసీఆర్ చెబుతున్న గుణాత్మక మార్పు అం శంలోనైనా.. ఇదే గమనించవచ్చు. వందేండ్ల తెలంగాణ రాజకీయ చరిత్రలో కచ్చితంగా ఈ దశాబ్దం నాది అని చెప్పుకునే విశిష్టత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్ తప్పకుండా తెలంగాణ యుగపురుషుడు. తెలంగాణ సమాజానికి ఓ వెలుగుదారి. భవిష్యత్ దిక్సూచి.
నమస్తే తెలంగాణ 23-12-2018)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం