28, ఏప్రిల్ 2023, శుక్రవారం

నన్నప నేని రాజకుమారి భయపడిన వేళ ....ఓ జ్ఞాపకం 4

83 తెలుగుదేశం బ్యాచ్ మహిళా నాయకులు రాజకీయాల్లో ఓ సంచలనం ... ఈ బ్యాచ్ టీడీపీ ద్వారా వచ్చినా అన్ని పార్టీల్లో ఓ వెలుగు వెలిగారు .ఆంధ్ర లోనే కాదు .... తెలంగాణ లోనూ ..మూలాలు ఆంధ్ర ఐనా కాట్రగడ్డ ప్రసూన , గడ్డం రుద్రమ దేవి వంటి వారు తెలంగాణాలో ఆ కాలం లో వెలిగి పోయారు .. భయం అనేది నా డిక్షనరీ లోనే లేదు అని బాలకృష్ణ లాంటి వారు సినిమా డైలాగులకు పరిమితం కానీ 83 బ్యాచ్ టీడీపీ మహిళా నేతలు ఆచరణలో చూపారు ... వీరు టీడీపీ , కాంగ్రెస్ , ప్రజాస్వామ్య తెలుగు దేశం ఎక్కడున్నా పాలలో నీళ్లలా కలిసి పోయారు . ఆడపడుచు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగినంత ఈజీగా కాంగ్రెస్ టీడీపీ రెండూ తమ పుట్టిల్లు లే అని స్వతంత్రంగా తిరిగే వారు .కాంగ్రెస్ లో ఉంటే టీడీపీ లో ఉంటే కాంగ్రెస్ అధికార కక్ష లోకి పాద రసం లా దూసుకెళ్లే వారు ... బాబు సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బాబు తన ఛాంబర్ వద్ద ఉన్నారు ... ఎప్పటి మాదిరిగానే బీట్ రిపోర్టర్ లు లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆపేసి ఎవరినీ అనుమతి ఇవ్వడం లేదని సెక్యూరిటీ ఆఫీసర్ ఆపేశారు ... కొద్ది సేపటి తరువాత కొమ్మినేని , రాధాకృష్ణ వస్తే వారినీ ఆపేసి నాకు ఎవరైనా ఒకటే అన్నట్టు బడుగు జర్నలిస్ట్ ల వైపు సెక్యూరిటీ అధికారి విజయ గర్వం తో చూశారు ... సాయికుమార్ పొలీస్ డైలాగు అంత స్ట్రిక్ట్ గా కనిపించాడు ఆ అధికారి ... అందరం ఛాంబర్ బైటే నిలబడ్డాం ... ఇంత లోనే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న రాజకుమారి దూసుకొచ్చి అక్కడో అధికారి ఉన్నాడు అనే ద్యాస కూడా లేకుండా పక్కకు తోసి ఛాంబర్ లోకి వెళ్లారు .. అధికారి మమ్ములను చూడనట్టే ఎటో చూడసాగాడు ... లోపలి ఎంత స్పీడ్ గా వెళ్లిందో అంతే స్పీడ్ గా ఆమె బయటకు వచ్చి , బయట పేపర్లతో ఏదో పని కోసం వచ్చిన వ్యక్తి చేయి పట్టుకొని లోనికి లాక్కెళ్ళింది ... అధికారి జర్నలిస్ట్ లను చూసి ఓ వెర్రినవ్వు నవ్వాడు ... ఆమె చదివింది ఐదో ఆరో తరగతి కానీ మనకెవరికీ లేని ధైర్యం ఉంది . ఆమె దూసుకెళ్లినట్టు మనం ఎవరం దూసుకెళ్లలేం లేం అని నేను అంటే ఓ నేత ఆమె చదువుకోలేదు కాబట్టే అలా దూసుకెళ్ల గలిగింది ... అదే చదువు కొంటే మనలా ఇలా బయట ఉండేది అన్నారు ... **** ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి ఆమె టీడీపీ లో చేరారు . 2004లో లో కాంగ్రెస్ అధికారం లోకి రాగానే టీడీపీ అధికార ప్రతినిధిగా రోజూ తిట్ల దండకం ... కాంగ్రెస్ అభిమానులకు అధికారం లోకి వచ్చాము అనే ఆనందం కూడా లేకుండా పోయింది ... Ysr కు సన్నిహితం గా ఉండే రవి చంద్ బాగా ఆలోచించి మందు కనిపెట్టాడు ...అప్పటికప్పుడు గంగా భవాని ని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు ... ఇద్దరూ 83 టీడీపీ బ్యాచ్ మేట్స్ ... క్లాస్ మేట్స్ , బ్యాచ్ మేట్స్ మాత్రమే కాకుండా ఒకే స్కూల్ లో రాజకీయ పాఠాలు నేర్చుకున్న వారు .... బంజారాహిల్స్ లో ఉన్న నన్నప నేని రాజకుమారి ఇంటి పైకి గంగా భవాని తన మహిళా అనుచరులతో కలిసి వెళ్లి దాడి చేసింది ... దమ్ముంటే బయటకు రా తేల్చుకుందాం అని గంగా భవాని తొడగొట్టి సవాల్ చేశారు ... అప్పటి వరకు సవాల్ చేయడం అంటే ఎవరి పార్టీ కార్యాలయం లో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆవేశం తెచ్చుకొని తిట్టడమే , కానీ ఇలా ఓ మహిళా నేత ఇంటికి మరో మహిళా నేత అనుచరులతో వెళ్లి దాడి చేయడం అదే మొదటి సారి కావడం తో నన్నపనేని భయపడి పోయారు ... పెదరాయుడు సినిమాలో పెదరాయుడు తో అతని ఉద్యోగి ఏదైతే చూడకూడదు అనుకున్నానో అది చూశాను అయ్యగారు అని డైలాగు పైకి చెప్పక పోయినా మీడియాగా మనసులోనే ఆ డైలాగు చెప్పుకున్నాం ... కొద్ది సేపటి తరువాత పోలీసులు వచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చారు . నన్నపనేని భయపడింది అదే తొలిసారి . ఒక మహిళా నాయకురాలిపై అనుచరులతో మరో మహిళా నేత దాడి చేయడం అదే మొదటి సారి అదే చివరి సారి ...వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి అన్నట్టు ....రవి చంద్ నన్నప నేని అనే వజ్రాన్ని గంగా భవాని అనే వజ్రం తో ....... బురదలో ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసినా , పోలీసులను తల్లి బిడ్డ చెంపదెబ్బలు కొట్టినా బోలెడు ప్రచారం లభిస్తుంది మీడియా లో ...పాత సిలబస్ తో రాజకీయం చేసే వారు ఇలాంటి వాటికి మురిసి పోతారేమో కానీ.... ప్రజలు మాత్రం ఈ రాజకీయాలను ఇష్టపడడం లేదు .. రాజకుమారి , గంగా భవానిల రాజకీయానికి కాలం చెల్లింది ... వారికి ఎప్పుడో తెలిసింది . మిగిలిన వారికి ఎన్నికల తరువాత తెలుస్తుంది ... *** ఓసారి రాజకుమారి నన్నప నేని నవరత్నాలు అని తొమ్మిది పుస్తకాలు రాసి ఫైనల్ చేసే ముందు చూడామని ఇస్తే కొద్ది సేపు చూసి వెనుక వైపు కవర్ పేజీలో పెద్ద తప్పు ఉంది అన్నాను ... ఏదీ ఏదీ అని అడిగితే ఆమె పుట్టిన తేదీ చూపా అప్పుడు ఆమెకు 55 .... బుక్ లో 55 అని ఉంది ... మీకు 40 ఏ కదా అంటే ఎంత మురిసి పోయారో .... ఇంకో ఆరు నెలల పాటు సోర్స్ గా ఉండేందుకు ఈ డోస్ పని చేస్తుంది అనుకున్నాను ...