27, ఏప్రిల్ 2023, గురువారం

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో TDLP లో సంబరాలు

నా జోస్యమే నిజమైంది... ఓ జ్ఞాపకం 3 తెలంగాణ అంశం పై వేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చింది . అసెంబ్లీ లోని TDLP కార్యాలయం లో ఉన్నాం ... కమిటీ నివేదికలో తొలి సిఫారసు టీవీ స్క్రీన్ పై కనిపించగానే TDLP లో ఒక్క సారిగా సంబరాలు మిన్నంటాయి . తొలి సిఫారసు రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర గా అలానే ఉంచాలి అని ... Tdlp లో సిబ్బంది నాయకులు ఒకరినొకరు అభినందించుకున్నారు ... అక్కడ తెలంగాణ సిబ్బంది ఎలాగూ లేరు నాయకులు కూడా వాస్తవ పరిస్థితి యెరిగి ఉండేవారు ... అంతా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారే ... శ్రీకృష్ణ కమిటీ తొలి సిఫారసు సమైక్యాంధ్ర అని రావడం తో వారి ఆనందం సహజమే ... తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజి , రాయల తెలంగాణ , ఇలా వరుసగా ఐదు సిఫారసుల తరువాత ,చిట్ట చివరగా ఆరవ అంశం తెలంగాణ ఏర్పాటు ... మొదటి అంశానికే ప్రాధాన్యత ఉంటుంది కానీ ఆరవ అంశం వరకు ఎందుకు వస్తారని Tdlp లోనే కాకుండా అసెంబ్లీ ఆవరణలో ఉన్న అన్ని పార్టీల శాసన సభ్యుల కార్యాలయాల్లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారు సంబరం తో ఒకరినొకరు కౌగిలించు కొని అభినందించు కున్నారు ... Tdlp లో ఇంకాస్త ఎక్కువ ఆనందం ... పానకం లో పుడకలా వారి ఆనందానికి మనమెందుకు అడ్డు అని నవ్వుకుంటూ tdlp లో మెట్లు దిగి కిందికి వస్తుంటే టీడీపీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్ర శేఖర్ రెడ్డి కనిపించారు . నిఖార్సైన బాబు అభిమాని ... రాయడానికి కాక పోయినా వివిధ అంశాల పై నిర్మొహమాటం గా చర్చించు కునే వాళ్ళం .. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పై నువ్వే మనుకుంటున్నావ్ అని రావుల చర్చ మొదలు పెట్టారు .. వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదు అనాలి అని అక్కడ మాట్లాడ లేదు కానీ కమిటీ నివేదిక తో వారు సంబర పడే విషయం ఏమీ లేదు ..నివేదిక గురించి ఒక్క మాట లో చెప్పాలి అంటే ? సోనియా గాంధీ గారు తెలంగాణ పై మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి ... అని కమిటీ చెప్పింది అంతే అన్నాను ... రావుల శేఖర్ రెడ్డి tdlp లో ఆనందంతో ఊగి పోతున్న వారిని చూస్తూ .... నీ అభిప్రాయం కరెక్ట్ ఎంతైనా సీనియర్ సీనియరే అన్నారు .2014 ఎన్నికలకు ముందు తెలంగాణ వస్తుంది ... అప్పటి వరకు కాల యాపన కోసం ఈ కమిటీ లు అని చెప్పాను . అదే జరిగింది . తెలంగాణ రావాలి అనేది తెలంగాణ వారి కోరిక , రావద్దు అనేది వ్యతిరేకించే వారి కోరిక ... ఇందులో తప్పేమీ లేదు ... కోరిక కు , అంచనాకు తేడా గ్రహిస్తే అంచనా తప్పదు ... జర్నలిస్ట్ కు కోరిక నిజం కాక పోవచ్చు కానీ , అంచనా ను కోరిక డామినేట్ చేయకూడదు ... తెలంగాణ ఇచ్చింది , తెచ్చింది కాంగ్రెస్ కదా ? కాంగ్రెస్ ను ఆదరించక పోవడం అన్యాయం కదా ? అని కొందరు వాదిస్తుంటారు ... తెలంగాణ కోసం ఉద్యమించింది తెలంగాణ ప్రజలు , నాయకత్వం వహించింది కెసిఆర్ , ఇచ్చింది సోనియా గాంధీ గారు . ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేక పోయినా తెలంగాణ రాక పోతుండే .. అంటే సోనియా ఇచ్చింది కదా ? అంటే కాంగ్రెస్ ఇచ్చింది కదా ? కాదు సోనియా గాంధీ ఇచ్చారు . సోనియా గాంధీ ఒక్కరే కాంగ్రెస్ కాదు ..ఇవ్వ వద్దు అని అడ్డుకున్న ysr , కిరణ్ కుమార్ రెడ్డి , లగడ పాటి నాయకత్వం లో అడ్డుకున్న ఆంధ్ర కాంగ్రెస్నాయకులు , ysr నాయకత్వం లో తెలంగాణ వద్దన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు .... సమైక్యాంధ్ర కోసం జగన్ పిలుపు మేరకు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన కొండా సురేఖ , తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మె లో ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి కి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలను హైదరాబాద్ తరలించిన డీకే అరుణ అందరు హేమా హేమీలైన కాంగ్రెస్ నాయకులే ... వారి అడ్డగింపు మహోద్యమంను జనం మరిచి పోలేదు ... అదే విధంగా సోనియా గాంధీ సహాయాన్ని మరిచి పోరు ... చాలా మంది బలవంతులు అడ్డుకున్నా పొన్నం ప్రభాకర్ , మధుయాష్కీ గౌడ్ లాంటి ఎంతో మంది పార్టీలోని పెత్తందార్లను వ్యతిరేకించి కూడా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు . అందుకే కాంగ్రెస్ ను రెండో స్థానం లో నిలిపారు .. తెరాస , కాంగ్రెస్ , టీడీపీ , బీజేపీ , ysr కాంగ్రెస్ , జనసేన ఏ పార్టీని ఐనా ఓటర్లు గెలిపించ వచ్చు . ఓటర్లు తప్పు చేయరు ... ఆ సమయానికి తగిన నిర్ణయం తీసుకుంటారు .. అంటే సోనియా గాంధీ , కాంగ్రెస్ వేరు అంటావు ? కాంగ్రెస్ లో సోనియా గాంధీ ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు ...