26, అక్టోబర్ 2009, సోమవారం

మీ పిల్లలతో చందమామ చదివిస్తున్నారా ..

మీ పిల్లలతో చందమామ చదివిస్తున్నారా? మా పిల్లలు చిన్న వాళ్ళు చదవలేరు అంటున్నారా మరీ మంచిది. చదవ లేక పొతే వింటారు కదా మిరే చదివి వినిపించండి. కాదు వాళ్ళు పెద్దవాళ్ళు అంటున్నారా యింకేం వారంతట వారే చదువుకుంటారు. అయినా ఈ కాలంలో పిల్లలు చందమామ చదవమంటే చదువుతారా అంటున్నారా అందుకే చదమామ చదివిస్తున్నర అని అడుగుతున్నాను. ఇదేమీ చందమామ వారి ప్రకటన కాదు. కొన్ని కార్పోరేట్ కంపనీలలో, పిజ్జా సెంటర్ లలో ఈ కాలం అమ్మయిలు సిగరెట్ తాగుతూ కని పిస్తున్నారు . వారిని చూస్తె బాద కలుగుతుంది. చెడిపోయే హక్కు మగవారికేనా ఆడవారికి వద్దా అనివాదిస్తారు కుడా . అమెరికాలో ఉన్నా అమ్మయిలు కూడా తెలుగుతనం కోసం పరితపిస్తుంటే వీల్లు ఇలా ఉన్నారని బాధగా ఉంటుంది. చిన్ననాటి నుంచే తలిదండ్రులు పిల్లల్లో విలువలు పెంపొందించడానికి కృషి చేస్తే ఇలాంటి పరిస్తితి ఏర్పడదు. అందుకే చిన్ననాటి నుంచే పిల్లలకు చందమామ చదివించే అలవాటు చేయాలి. పిల్లల కథలు అంటే కేవలం కాలక్షేపం కోసమే కాదు. ఆ కథల్లో చిన్ననాటి నుంచే విలువలు అలవాటు కాగలవు . ఈ కాలంలో వ్యక్తిగత ప్రయోజానం కుడా లభిస్తుంది. చిన్ననాటి నుంచే చందమామ చదివే అలవాటు ఉంటే, పరీక్షల్లో సమాధానాలు చక్కగా రాయడం అలవాటు అవుతుంది. విశ్లేషణ శక్తి అలవడుతుంది. ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే జ్జానం అలవడుతుంది. ఐ ఏ యస్ , గ్రూప్ పరీక్షల్లో పాస్ ఐన చాలమంది తెలుగు వారు తమకు చిన్న నటి నుంచి చదివిన చందమామ ఉపయోగ పడిందని చెప్పారు. పురాణాల గురించి అవగాహన కలగడానికి చందమామ ఉపయోగ పడుతుంది. యిక చిన్ననాటి నుంచే ఇంగ్లిష్ బాష జ్జానం అలవడడానికి చందమామ చదవది, చదివించండి. రెండు పిజ్జాలతో యెంత ఆరోగ్యం పడవుతుందో తెలియదు కానీ రెండు పిజ్జాల డబ్బు తో ఏడాది కాలం చందమామ వస్తుంది. మీ పిల్లల పుట్టిన రోజు వచ్చిన, బందువులు , తెలిసిన వారి పిల్లల పుట్టిన రోజు కైనా పిల్లల కథల పుస్తకాలను బహుమతిగా అందించండి. వారికి వచ్చిన బహుమతుల్లో మీరు ఇచిన బహుమతి కరిదనది కాకపోవచు కానీ కచితంగా వారికీ వచ్చిన బహుమతులన్నిటికన్న మీ బహుమతి ప్రయోజానకరమైనది అవ్తుంది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా పుస్తకాలనే బహుమతిగా ఇవ్వండి.

22, అక్టోబర్ 2009, గురువారం

నడమంత్రపు నటన


సికింద్రాబాద్ లో చవక ధరలో జీవిత అనుభవం

సికిందరాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అన్ని తక్కువ ధరకే లబిఇస్తాయి చివరకు జివిత పాఠాలు కుడా. నిన్న సికందరాబాద్ వెళితే ఏదో దూర ప్రాంతం నుంచి వచ్చిన దంపతులో కనిపించారు వాళ్లు ఆపిల్స్ కొన్నారు బండిమీద ఉన్నవాటిలో చాల చక్కగా ఉన్నవాటిని కొన్నాం కదా ఇప్పుడు చుస్తే అందులో మూడు చెడిపోయినవి ఉన్నాయ్. ఇది ఎలజారిగింది. తప్పు ఎవరిది అని వారిలో వారు వాదూలడుకుంటున్నారు . మీరు కూడా సికిందరాబాద్ వెళితే ప్రయత్నించి చూడండి ఇలాంటి అనుబవమే కలుగుతుంది. కొద్దిసేపటి తరువాత జోక్యం చేసుకొని చెప్పాను. మీ యిద్దరిలో ఎవరి తప్పు కాదు . ఇక్కడి పళ్ళు అమ్మే వారి మాయాజాలం అది అని చెప్పను. మీరు మంచివి వెతికి తీసుకున్న వాటిని కవర్ లో వేస్తున్నట్టు చేసి అవి పక్కన పెట్టి అప్పటికే కవర్ లో ఆటను కొన్ని మంచివి, చెడ్డవి కలిపి ఉంచిన కవర్ ఇస్తాడు. ఆ విషయం చెబితే వాళ్లు మరీ ఇంత అన్యాయమా అంటు వాపోయారు. ఆలా ఎందుకు అనుకుతారు కేవలం యాబై రూపాయల కర్చుతో గొప్ప జీవిత నేర్పించాడు అనుకూవచు కదా . లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొంటె అది అప్పటికే ఎవడు కొన్నాడని మోసపోయామని తెలిసి వస్తుంది. అప్పటినుంచి జాగ్రతగా ఉంటాం. కాని ఇక్కడ కేవలం యాభై రూపాయలతో నిరంతరం మనం అప్రమత్తంగా ఉండాలని,ఒక పాఠాన్ని నేర్చుకున్నాం కదా అని చెపితే అప్పటి వరకు కిచులడుకున్న వాళ్లు ఇలా అలూచించడం బాగుంది అని నవ్వుకున్నారు. ఇది నిజాంగ చాల గక్కువ ధరకు లభిఇస్తున్న అనుబవం అంటే ఒప్పుకుంటారా లేదా .. బాధపడే కంటే ప్రతి అనుభవాన్ని పాటంగా తీసుకుందాం. మన అమాయకత్వానికి మనమే నవ్వుకుందాం. అప్పుడు జీవితమ్ హప్పిగా ఉంటుంది .

17, అక్టోబర్ 2009, శనివారం

miiru yelanti vaaru

మీరు ఎలాంటివారో మీకు మీరే నిర్ణయించు కోవడానికి ఒక చిన్న కథ. ఇది చైనా కు చెందినా జానపద కథ . ఒక వృద్ధురాలు ఎప్పుడు చూసినా ఏడుస్తూ కనిపించేది. ఒక యువకుడు ఆమెను ఏడవడానికి కారణం అడిగాడు. నాకు ఇద్దరు కుమార్తెలు వారికి పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద అమ్మాయి మొగుడు గొడుగులు అమ్ముతాడు. రెండవ అమ్మాయి మొగుడు నూడుల్స్ తాయారు చేసి అమ్ముతాడు. వర్షా కాలం రాగానే రెండవ కూతురు గుర్తుకు వస్తుంది. వర్షం లో నూడుల్స్ చేయలేరు . దాంతో ఆ కూతురు ఇంట్లో ఎలా గడుస్తుందో, పిల్లలను ఎలా పోసిస్తున్నారో అని తలచుకుంటేనే ఏడుపు ఆగడం లేదు. అని చెప్పింది నిజామే కూతురు ఇబ్బందుల్లో ఉంటే ఏ తల్లి కై న యిలాగే ఉంటుంది. అది సరే మరి ఎండ కాలం లో కూడా మీరు ఏడుస్తూనే ఉంటారు కదా అని మళ్లీ అడిగాడు. మరి ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది అంటు ఆ వృద్ధురాలు చెప్ప సాగింది. పెద్ద కూతురు మొగుడు గొడుగులు తాయారు చేసి అమ్ముతాడు. ఎండా కాలం లో గొడుగులు అమ్ముడు పోవు దాంతో పెద్ద కూతురు కుటుంబం ఎలా గడుస్తుందో , ఏం తింటున్నారో, పిల్లలకు ఏం పెడుతున్నారో అనే ఆలోచన రాగానే ఏడుపు వస్తుంది అని చెప్పి ఏడవసాగింది. ఆ యువకుడు నీ సమస్య చాల న్యాయమైనదే రేపు పరిష్కారం చెబుతాను అని వెళ్లి పోయాడు. మరుసటి రోజు వచ్చి వర్హకాలం రాగానే పెద్ద కూతురును గుర్తు చేసుకో వర్షాల వల్ల గొడుగులు బాగా అమ్ముడు పోయి పెద్దకూతురు కుటుంబం యెంత సంతోషంగా ఉందొ కదా అని అనుకుంటే అంతకు మించిన ఆనందం ఉండదు. ఇక ఎండా కాలం రాగానే చిన్న కూతురు కుటుంబాన్ని గుర్తు చేసుకో నూడుల్స్ అమ్ముతూ వారెంత సంతోషంగా ఉన్నారో కదా అని గుర్తు చేసుకుంటే అంతకు మించిన ఆనడం ఉండదు. అని సలహాఇచ్చి వెళ్ళాడు. మనం సంతోషంగా ఉండాలా బాద పడాల అనేది మా ఆలోచన విదానం పై ఆదర పది ఉంటుంది.కొందరు నిరంతరం మధన పడుతుంటారు దేనికి బాద పడదామా అని ఆలోచిస్తుంటారు . ఆ వృద్దురాలి పై సలహా చేసిందా లేదా అనే సందేహం వద్దు. వృద్దురాలి మాదిరిగా నిరంతరం మదమదన పడదామా , సంతోషంగా ఉందామా అని ఎవరికి వారేనిర్ణయించుకోవాలి. సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న మనలో చాలమంది ఆ వృద్దురాలి మాదిరిగానే ఆలోచిస్తుంటారు. మనలో చాల మంది ఆ వృద్దురాలి మాదిరిగానే ఉంటారు.

అమృత మథనం

పూర్వం దేవతలు రాక్షసులు అమృత మథనం చేశారు . అమృత మథనం లో అలసిపోయిన తరువాతనే అమృతం లబించింది. జీవితం కూడా అంతే. జివితమనే సముద్రాన్ని మదిస్తే అమృతం లబిస్తుంది. చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేక జీవితాన్ని చాలించడం తగదు. సమస్యల నుండేరాటు తేలాలి. సాన బట్టిన తరువాతనే వజ్రం మెరుస్తుంది . సమస్యలను తట్టుకొని నిలుస్తేనే అమృతం లబిస్తుంది. అమృత మథనం బ్లాగ్ ద్వార సానుకు ల దృక్పదం కలిగించే చిన్న చిన్న కథలు రాయడానికి ప్రయత్నిస్తాను. విటి తో పాటు రాజకీయ అంశాలు కూడా ఉంటాయి . చదివి మీ అభిప్రాయాలూ చెబుతారని ఆశిస్తున్నాను. బుద్దా మురళి