13, మే 2023, శనివారం

ఒక వార్త రెండు పిట్టలు... ఓ జ్ఞాపకం ...

ఒక వార్త రెండు పిట్టలు ఓ జ్ఞాపకం ... తెలుగు యువత అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ బ్యాంకు కు బదులు ఉన్నత విద్యా మండలి నుంచి ఋణం తీసుకోవాలి అనుకుంటున్న ప్రభుత్వం ... Ysr సీఎం గా ఉన్నప్పుడు ఈ రెండు వార్తలు ఆంధ్ర ప్రభ మొదటి పేజీలో చూడగానే తోటి రిపోర్టర్లు , ప్రభుత్వం , రాజకీయపక్షాలు బుర్ర గోక్కోవడం మొదలు పెట్టారు ... ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా ysr బంధువు ఉండేవారు ... ఈ వార్త పై వివరణ ఇవ్వడానికి మీడియాను పిలిచి వెర్రి చూపులు చూడసాగాడు ... ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యం లోనే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు .. దానికి కొంత ఫీజు వసూలు చేస్తారు .అందులో కొంత మిగులుతుంది .. అదే ఉన్నత విద్యా మండలి ఆదాయం .. వేల కోట్ల రూపాయలను దేశాలకు , రాష్ట్రాలకు ఋణం ఇచ్చే ప్రపంచ బ్యాంకు ఎక్కడ ? విద్యా మండలి ఎక్కడ ? రెండింటికి పోలిక ఏమిటో అర్థం కాక , ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉన్నత విద్యా మండలి కార్యదర్శి క్రిస్టోఫర్ వెర్రి చూపులు ..... @@@ ఎన్టీఆర్ భవన్ లో అదే పరిస్థితి ... టీడీపీ పుట్టిన కొత్తలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు తెలుగు యువత అధ్యక్షుడు ... ఆ తరువాత ప్రాధాన్యత లేదు .... సినిమాల్లో నంబర్ వన్ గా వెలిగిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ పనీ పాటా లేని , ఉండని యువత పోస్ట్ ఎందుకు తీసుకుంటారు అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు .... *** అటు టీడీపీ , ఇటు ఉన్నత విద్యా మండలి , ఈ రెండు విభాగాల వార్తలు రాసే మీడియా ఆ రోజంతా వీటి గురించే .... ఎందుకు రాశారు ? ఎవరు రాశారు అని ... ***** బాబు హయం లో కొందరు టీడీపీ రిపోర్టర్ లే కాదు విద్యా విలేఖరులు కూడా కొందరు ఓ వెలుగు వెలిగారు . కొందరు సొంత విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు . అలా సొంత విద్యా సంస్థ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్ట్ కొంత కాలం గడిచాక తిరిగి జర్నలిజం లోకి వచ్చారు . రాజకీయం , సినిమా , జర్నలిజం ఏదైనా కావచ్చు రోజూ కనిపిస్తేనే గుర్తింపు . చాలా గ్యాప్ తీసుకోని తిరిగి వస్తే పట్టించుకోరు ...మరేం చేయాలి ... బాగా కష్టపడి పని చేస్తే పదేళ్లలో కూడా రాని గుర్తింపు ఒకే ఒక్క రోజులో అంతకు మించి గుర్తింపు తెచ్చు కున్నాడు ... అతను తిరిగి జర్నలిజం లోకి రాగానే రెండు బీట్లు ఇచ్చారు . టీడీపీ , విద్యా శాఖ ... అతను వస్తూనే జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు యువత అని రాజకీయ వార్త . ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఉన్నత విద్యా మండలి నుంచి ఋణం అని విద్యా శాఖ వార్త రాసి కలకలం సృష్టించాడు . ఇది నిజామా ? సాధ్యమా ? ఎవరికీ అవసరం లేదు . నువ్వు రాసింది నిజం కాలేదు అని అడిగే బాస్ ఉండరు కానీ , వాళ్ళు రాసింది నువ్వెందుకు రాయలేదు అని అడిగే బాసులు ఉంటారు ... ఒకే ఒక రోజులో అతని తిరిగి జర్నలిజం లోకి వచ్చాడు అని సర్వ జనులకు తెలిసేట్టు చేసిన అతనితెలివి తేటలకు ముచ్చటేసింది .. తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలతో కనిపించేదంతా నిజమే అనుకునే వారి సంఖ్య తక్కువేమి కాదు ... నిజం అబద్దం ఈ రెండే కాదు వార్తల వెనుక ఎన్నో రహస్యాలు , ప్రయోజనాలు దాగి ఉంటాయి ... మేనేజ్ మెంట్ ప్రయోజనాలు , ఎడిటర్ , బాస్ , రిపోర్టర్ ఎవరి ప్రయోజన మైనా కావచ్చు ... నల్లటి అక్షరాలు అన్నీ నిజాలు కావు అబద్దాలు కావు ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం