10, మే 2023, బుధవారం

ఎన్టీఆర్ భవన్ క్యాంటిన్ కూ ఉంది చరిత్ర

ఎన్టీఆర్ భవన్ క్యాంటిన్ కూ ఉంది చరిత్ర జ్ఞాపకాలు 2004 లో తెలుగుదేశం ఓడిపోయాక ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో నన్నప నేని రాజకుమారి చూడు మేం ఓడిపోయినా ఎన్టీఆర్ భవన్ ఎప్పుడూ కళకళ లాడుతోంది అంటే ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను క్యాంటిన్ బంద్ చేసిచూడండి ఎన్టీఆర్ భవన్ ఎంత కళకళ లాడుతుందో చూడండి అన్నాను ... ఆమె ఫకాలున నవ్వి అంతేనా ? అన్నారు . పేరుకు క్యాంటిన్ కానీ అక్కడ ఎన్నో చర్చలు జరిగేవి . ఎర్రంనాయుడు , ఉమ్మారెడ్డి , లాల్ జాన్ బాషా వంటి హేమాహేమీలు అక్కడ భోజనం చేస్తూ మీడియాతో బోలెడు సంగతులు పంచుకునే వారు . అప్పుడప్పుడు బాబు కూడా ... **** పార్టీ పుట్టినప్పటి నుంచి హిమాయత్ నగర్ లో టీడీపీ కార్యాలయం ఉండేది . ఆ భవనం ఓ నవాబులది . పార్టీ నాయకుడు కూడా .. ఎన్టీఆర్ ను బాబు దించేశాక ప్రభుత్వం , పార్టీ , బ్యాంకు డిపాజిట్లు అన్నీ బాబు తీసేసుకున్నా పెద్ద మనసుతో ఈ అద్దె భవనాన్ని మాత్రం ఎన్టీఆర్ కు వదిలేశారు . అదే హిమాయత్ నగర్ లో ఈ భవనానికి కొద్ది దూరం లోనే అదే నవాబు గారికి ఇంకో భవనం ఉండేది . దాన్ని బాబు టీడీపీ కి ఇచ్చారు . బాబు నాయకత్వం లో టీడీపీ తొలుత ఇక్కడి నుంచే పని చేసేది . బాబు బంజారాహిల్స్ లోని తన ఇంటికి వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు దారిలోని ఓ విశాలమైన ఖాళీ స్థలం పై పడింది . అది ప్రభుత్వ స్థలం mch వాళ్ళు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాడని కి ఏర్పాట్లు చేశారు . ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోవడం ఎంత పని ... ఎన్టీఆర్ విధానాల పై విస్తృత చర్చ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అంటూ , ఆ ట్రస్ట్ పేరు మీద ఈ స్థలం తీసుకోని బిల్డింగ్ కట్టారు ... దాదాపు 16 ఏళ్ళు రోజూ వెళ్ళాను . ఎన్టీఆర్ విధానాల పై రహస్యంగా ఏం చర్చలు జరుపుతారో తెలియదు . సుదూర ప్రాంతాల్లో సమావేశాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి మీడియాను అక్కడికి తీసుకువెళ్లడం మాములే . హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయం నుంచి వాహనాలు ఏర్పాటు చేసి బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు తీసుకువెళ్ళేవారు ... ఇప్పుడంటే ఎన్టీఆర్ భవన్ సిటీ మధ్యలో ఉన్నట్టు కానీ అప్పుడుదూరం అనిపించేది . అందుకే కొద్ది రోజులు మీడియాకు వాహనాలు ఏర్పాటు చేశారు . భవనం లో దాదాపు ఒకే సారి వెయ్యి మంది భోజనం చేయగల క్యాంటిన్ ప్రత్యేకం ...దాదాపు రాష్ట్ర విభజన వరకు క్యాంటిన్ సందడిగా ఉండేది ... ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాయకులు మొక్కుబడిగా మాట్లాడినా ఆ క్యాంటిన్ లో మనసు విప్పి ఆలోచనలు పంచుకునే వారు .ఆ క్యాంటిన్ లో ఎన్నో రుచికరమైన వార్తలు దొరికాయి . ఈ భవన్ , క్యాంటిన్ గురించి అన్ని పార్టీల వారిలో ఆసక్తి ఉండేది . పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యం . సత్యనారాయణ రావు ఓ సారి బహిరంగం గానే మీ భవన్ అద్భుతంగా ఉంటుందట ... చేయి పెట్టగానే ట్యాప్ నుంచినీళ్లు వస్తాయట కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఓ సారి వచ్చి చూస్తాను అన్నారు . ఒక పార్టీ కార్యాలయాన్ని ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడు బహిరంగం గా పొగడడం అదే మొదటి సారి చివరి సారి . తెలంగాణ నేతలు - అద్దెకు షాప్ అక్కడ క్యాంటిన్ కే కాదు భవన్ లో భాగంగా ఒక పక్కకు ఓ టీ షాప్ ఉండేది . సిగరెట్లు , టి , సమోసా అమ్ముతారు .దానికీ ఓ చరిత్ర ఉంది . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులు ఆ షాప్ ముందు టీడీపీ నేత అమర్నాథ్ తో పిచ్చాపాటి .. తెలంగాణ వెనుకబడి ఉంది అంటే ఈ ప్రాంత నేతల వైఫల్యమే... ప్రాజెక్ట్ లు కట్టమని అడగక పోవడం వాళ్ళ తప్పే కదా ? ఇలా సాగుతుంది ఆయన వాదన ... నేను అంతా విని బాగా మాట్లాడవు అని మనం టి తీసుకున్న షాప్ ఉంది కదా ? మీ వాదనకు ఇదే సమాధానం . దివాకర్ అని అప్పుడు డీసీ లో ఉండేవారు సీనియర్ రిపోర్టర్ ఓ రోజు సరదాగా మాట్లాడుతూ ఎన్టీఆర్ భవన్ బయట ఉన్న ఆ చిన్న షాప్ అద్దెకు ఇప్పించు మురళి ఈ ఉద్యోగం కన్నా అది బెటర్ అంటే నేను సీరియస్ గానే తీసుకోని విచారించాను . అడగాలే కానీ అదెంత పని అనుకున్నాను . విషయం తెలుసుకుంటే ఆమ్మో అనిపించింది .. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తులసీ రామ్ అని ఉండేవారు మాజీ ఎంపీ .. తన కుమారుడి కోసం ఆ షాప్ అద్దెకు అడిగారు .. బాబును ఎన్నిసార్లు కోరినా కాలేదు ... ఉపాధ్యక్షుడు అంటే బాబు తరువాత స్థానం ... ఆయన అడిగితే ఓ షాప్ అద్దెకు ఇవ్వలేదు . షాప్ దగ్గర కూడా ఆయన పలుకుబడి పని చేయలేదు ... ప్రాజెక్ట్ ల దాకానా ? అంటే నవ్వుతూ వాదన అంగీకరించాడు ... హేమా హేమీలు ఎందరు ప్రయత్నించినా దిక్కులేదు . నారా భువనేశ్వరి సిఫారసుతో ఒకరికి ఇచ్చారు ... అందుకే మహా భక్త రామదాసులు కూడా మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అటు నుంచి నరుక్కు వస్తారు ... తెలంగాణ వాళ్ళు ఆ క్యాంటిన్ దక్కించు కోవడం లో విఫలమయ్యారు కానీ ... తెలంగాణ ను దక్కించు కోవడం లో విజయం సాధించారు .. **** ఎన్టీఆర్ భవన్ బయట ఖాళీ స్థలం లో కిందకూర్చొని దాదాపు అరడజను మంది ఖద్దరు బట్టలు అమ్మేవారు ....పార్టీ సమావేశం ఉంటే కనీసం డజను మంది ఖద్దరు బట్టలు అమ్మేవారు . ఎవరు అధికారం లోకి వస్తారు ? ఎవరు పోతారు అని ముందుగా పోలీసులు గ్రహిస్తారు అంటారు ... తెలంగాణ ఏర్పడగానే అక్కడ డజను మంది బట్టల వ్యాపారుల స్థానం లో ఇద్దరే కనిపించారు . తరువాత ఒక్కరూ కనిపించ లేదు ... ఏ లెక్కలో తెలియదు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ లో టీడీపీ విలువ పదివేల కోట్లు ఉంటుంది అన్నారు . నాకు ఆ లెక్కలు తెలియవు కానీ ఈ సెంటర్ లో మ్యారేజ్ హాల్ లేదు ... ఎన్టీఆర్ భవన్ మ్యారేజ్ హాల్ కు సరిగ్గా సరిపోతుంది అన్నాను . ఇప్పటికీ అదే అభిప్రాయం ..... **** కబుర్ల కేం కానీ ఎన్టీఆర్ భవన్ సిటీకి దూరం అనుకున్న కాలం నుంచి టీడీపీ రిపోర్టర్ ను అంటున్నావు మరి ఏమైనా భూములు , ప్లాట్స్ అంటారా ? ఆయనే ఉంటే బార్బర్ తో పనేంటి అని భూములు , ప్లాట్స్ కొని ఉంటే ఈ కథలు కాకరకాయలు రాస్తూ ఎందుకుంటాను ? భూముల లెక్కలు చూసుకుంటూ ఉండే వాడిని కానీ

1 కామెంట్‌:

  1. హర్రీ బర్రీ గా రాసినట్టున్నారండీ కాస్త ఓపిక తీసుకుని విశదీకరిస్తూ వ్రాయండి (ఈ ఒక్క టపా పది టపాలకు పెట్టుబడి - "అసలేం జరిగిందంటే" సీరీస్ లా అన్న మాట :))

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం