22, మే 2023, సోమవారం

జయప్రద , రేణుకా చౌదరి బాబు ల చిదంబర రహస్యం మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు

జయప్రద , రేణుకా చౌదరి బాబు ల చిదంబర రహస్యం మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు ..... ఏదైనా వివాదంపై ముఖ్యనాయకుల సమావేశం జరిగితే , సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు జర్నలిస్ట్ లకు నిద్ర పట్టదు . క్యాబినెట్ సమావేశంలో మీడియాకు విషయాలు చెబితే తాట వలుస్తా అని సీఎం హెచ్చరిస్తే క్యాబిజెట్ ముగియగానే ఈ విషయం కూడా మీడియాకు తెలిసిపోతుంది . 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఎంపీలుగా ఢిల్లీలో జయప్రద , రేణుకా చౌదరి వెలిగిపోతున్న రోజులు . ఇద్దరి మధ్య ఎందుకో వివాదం తలెత్తింది . జయప్రదను ఉద్దేశించి ఓ ఇంగ్లీష్ పత్రికలో రేణుక చౌదరి పింప్ అంటూ ఏదో వాఖ్య చేశారు . పంచాయతీ చంద్రబాబు వద్దకు వచ్చింది . హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం మంచి మాస్ మసాలా న్యూస్ వస్తుంది అని మీడియా చాలా సేపు ఎదురు చూసింది . ఇద్దరితో బాబు సుదీర్ఘంగా మంతనాలు . ఇలాంటి సమావేశం ఏది జరిగినా తరువాత మీడియాను పిలిచి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు , ఇదంతా మీడియా కల్పించిన సృష్టి అని రొటీన్ డైలాగులు , ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటో షెషన్ తో ముగుస్తుంది . కానీ ఆ రోజు ఏం జరిగిందో , బాబు ఇద్దరికీ ఏం చెప్పారో ? ఏం రాజీ కుదిర్చారో ఎవరికీ తెలియదు . వీరిద్దరూ చెప్పలేదు . అటు బాబు మీడియా ముందు నోరు విప్పలేదు . జర్నలిస్ట్ లు ఎంత ప్రయత్నించినా ఈ ముగ్గురి నుంచి విషయం బయటకు రాలేదు . ఆ సమావేశం జరిగి 28 ఏళ్ళవుతున్నా సమావేశంలో ఏం జరిగి ఉంటుంది అనే సందేహం తొలుస్తూనే ఉంటుంది . తోచింది రాసుకోవడమే కానీ ఏం జరిగిందో ఆ ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియలేదు . టీడీపీ నాదే అని ఎన్టీఆర్ వేసిన కేసు కొట్టేసి బాబుదే అని తీర్పు వచ్చింది . తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిబదిలీ అయ్యాక జయప్రద వెళ్లి బొకే ఇచ్చిన ఫోటో ను సైతం మీడియా సంపాదించింది కానీ .. ఇప్పటికీ సమావేశం వివరాలు సంపాదించలేదు . ఆ తరువాత ఇద్దరూ టీడీపీకి దూరం అయ్యారు / దూరం పెట్టారు . సమాజ్ వాది పార్టీలో చేరారు . అమర్ సింగ్ ఆశీస్సులతో ములాయం పార్టీలో ఉత్తరాదిలో జెండా ఎగురవేశారు . అనంతరం అమర్ సింగ్ కె అడ్రెస్ లేకుండా పోయింది . ములాయం సింగ్ లేరు . వాళ్ళ అబ్భాయి తాజా రాజకీయ జీవితాన్ని వెతుక్కుంటున్నారు .ఇక రేణుకా చౌదరి చంద్రబాబు సిఫారసు లేకుండానే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో కేంద్రమంత్రి పదవి చేపట్టారు . తరువాత టీడీపీకి దూరం అయి కాంగ్రెస్ లో చేరారు . మధ్యలో సొంతంగా ఓ పార్టీ పెట్టారు . పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో శాసన సభ్యులు గెలిచారని , వారి పేర్లు చెప్పను రహస్యం అని జెమిని టివి ధర్మ పీఠం లో చెప్పారు . జయప్రద , రేణుకా , బాబుల సమావేశం చిదంబర రహస్యమే తెలుసుకోలేక పోతున్నాం , ఆ రహస్య శాసన సభ్యుల పేర్లు తెలుసుకొనే అదనపు శ్రమ ఎందుకులే అని ఎవరూ ఆ మాటను సీరియస్ గా తీసుకోలేదు . సోనియాగాంధీకి తృటిలో ప్రధాన మంత్రి పదవి తప్పిపోయినప్పుడు ఢిల్లీలో త్యాగం మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నేతలంతా ఆమెను వేనోళ్ళుగా పొగడసాగారు . రేణుకా చౌదరి వంతు వచ్చింది . ఆమె కాంగ్రెస్ కు కొత్త ఆ ఏం మాట్లాడుతుంది లే అనుకున్నారు . ఆమె మైకు పట్టుకొని బోరున ఏడ్చారు . మాటలు లేవు మాట్లాడుకోడాలు లేవు మైకు కూడా తడిచిపోయేంతగా , కరిగిపోయేంతగా ఏడ్చారు . టీడీపీ ట్రైనింగా ? మజాకానా ? అనుకున్నారు అంతా . తెలంగాణ ఏర్పడేప్పుడు సీఎం రేస్ లో నేను లేను చాలా పనులు ఉన్నాయి అని ప్రకటించారు . ఇప్పుడు ఆంధ్ర నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు .(ఒకే గవర్నర్ రెండు రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఒకే సీఎం రెండు రాష్ట్రాలకు సీఎం గా ఉంటే తప్పేమిటి ?) ఏదో ఒక పార్టీలో చేరాలి అని జయప్రద తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కాలం , వయసు , పరిస్థితులు సహకరించడం లేదు . కాంగ్రెస్ వెలిగిపోతే రేణుకా చౌదరి వెలిగిపోయే వారు . కానీ .... పరిస్థితులు కలిసి రావడం లేదు . అన్ని రోజులు మనవే కావు . రోజుల సంగతి ఎలా ఉన్నా 28 ఏళ్ళు గడిచినా ఆ సమావేశం చిదంబర రహస్యం ఏమిటో తెలియడం లేదు . ఏమై ఉంటుందా ? అని 95లో హైదరాబాద్ లో రిపోర్టింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆ ప్రశ్న నన్ను తొలుస్తూనే ఉంది . ఇంతకూ ఏం జరిగి ఉంటుందో ?

2 కామెంట్‌లు:

  1. అవ్వాళ ఏమీ జరగ లేదండీ.
    ముగ్గురూ వేరు వేరు రూముల్లో ఆ సమయం మొత్తం వెచ్చించారు.
    ఆ పై ట్విస్టు నో స్టేట్మెంట్.

    మసాలా మీడియాకి దొరక్క పోవడంతో మజా లే :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. లేదు .. ముగ్గురు  ఒకే చోట ఉన్నారు . ఇప్పుడున్న ఎన్టీఆర్ భవన్ చాలా పెద్దది . వెయ్యి మంది ఒకే సారి భోజనం చేయవచ్చు . సమావేశం కావచ్చు . విశ్రాంతి తీసుకోవాలి అన్నా అనేక గదులు ఉన్నాయి . అప్పుడు హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయం అంత పెద్దది కాదు . ముగ్గురు వేరు వేరు  గదుల్లో ఉండేందుకు అక్కడ విడిగా మూడు గదులు ఉంటే కదా ? ఒకే చోట ఉన్నారు 

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం