13, ఆగస్టు 2011, శనివారం

అవినీతి ఉద్యమంలో ముందున్నఅవినీతి పరులు ..

అన్నిరోగాలకు జిందాతిలస్మాత్ మందు అన్నట్టు జనలోక్‌పాల్ వస్తే చాలు అవినీతి అంతా మటుమాయం అవుతుందని భావిస్తున్నారు. దీని సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అవినీతిపరులే ముందుండడం విశేషం. బ్రిటీష్ పాలన కొనసాగాలని కోరుకున్న వర్గాలే స్వాతంత్య్రం లభించిన కొంత కాలం తరువాత అధికారం సాధించారు. ఇప్పుడు అదే విధంగా అవినీతిలో ముందున్న వారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు.

నంది శ్రీహరి అన్న ఒక ‘ఉద్యమ’ కారుడు, సినిమా నిర్మాత సమాజంలోని అవినీతికి చలించి పోయాడు. వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఎండగడుతూ నగరం నిద్రపోతున్న వేళ అని సినిమా తీశాడు. చక్కని సినిమా అని అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేశారు. అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తున్న బాబుగారికి చెందిన స్టూడియో ఎన్ చానల్‌లో ఆ సినిమాపై ప్రత్యేక కార్యక్రమాన్ని చూపించారు.


 ఈసినిమాలో వైఎస్‌ఆర్ కుంభకోణాలను బయటపెట్టామని, జగన్ మనుషులు సినిమా నడవకుండా దాడులు చేస్తున్నారని చెప్పారు. రంగంలోకి దిగిన సినీ నటుడు, టిడిపి మాజీ మంత్రి బాబు మోహన్ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? పేపర్లలో వచ్చిన వార్తలతోనే సినిమా తీశారని, చక్కని సందేశాత్మక సినిమా అని, నిర్మాత అభిరుచిని మెచ్చుకున్నారు.
 ఆ నిర్మాత సైతం అవినీతి సమాజాన్ని ఎలా పట్టిపీడిస్తుందో, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతుందో సందేశాత్మకంగా వివరించారు. అంతా బాగానే ఉంది కానీ ఇది జరిగిన రెండువారాలకే ప్రజలను చీటింగ్ చేస్తున్నారని ఆ నిర్మాత నంది శ్రీహరిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
 ఆయన అరెస్టుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒక గొప్ప ఉద్యమ కారున్ని కోల్పోయినట్టు అయింది. బెయిల్‌పై వెంటనే బయటకు వచ్చి ఆయన తన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుందాం.ఆయన మరో సినిమా కూడా తీస్తున్నారట! బహుశా అది కూడా అవినీతికి వ్యతిరేకంగా సందేశాత్మక సినిమానే అయి ఉంటుంది. 


అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించగానే ఆయన దీక్షకు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాల్లో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్ మాఫియా ప్రభావం పడి కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.మంత్రి పదవి కోల్పోయిన గాలి సోదరులకు కొత్త మంత్రివర్గంలో స్థానం కూడా దక్కలేదు.


 కానీ తన అవినీతి కేసుల్లో విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న చరిత్ర బాబుగారిది. తనపై ఇరవై ఒక్క కమిటీలు, కమీషన్‌లు వేసి విచారణ జరిపిస్తున్నారని చంద్రబాబు సగర్వంగా ప్రకటించుకుంటారు. ఇక చంద్రబాబుతో అవినీతిపై ఉద్యమానికి బాబా రాందేవ్ ఎమ్‌ఓయు కుదుర్చుకున్నారు. బాబు ఒక్కరినేనా రాష్ట్రంలో ఇంకెవరితోనైనా కలిసి ఉద్యమిస్తారా? అని ఆయన్ని ప్రశ్నిస్తే, ఎవరు వచ్చినా తన తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన ప్రకటించారు.


 అంటే బాబాకు ఒకవైపు బాబు మరోవైపు జగన్ నిలిచి అవినీతిపై ఉద్యమిస్తుంటే దాన్ని సినిమాగా తీయడానికి నంది శ్రీహరి సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని చూసి మనం ఏ మాత్రం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో చాలా కాలం నుండి నైతిక విలువల ప్రచారంపై గుత్త్ధాపత్యం తీసుకున్న రాజగురువు చట్ట వ్యతిరేక ఆర్థిక వ్యవహారాలు బయటపడడంతో పాతిక శాతం ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఎలాగైనా, ఏం చేసేనా రాజగురువు స్థాయికి ఎదగాలని కలలు కంటున్న పిల్ల రాజగురువు ఒకరు ఇప్పుడు రాష్టమ్రంతటా తిరిగి విద్యార్థులకు నైతిక విలువలు బోధిస్తున్నారు. అవినీతి నిర్మూలన జరగాల్సిందే కానీ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అవినీతి పరులు ముందుండడం, దాన్ని తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించడం ఎవరికి మేలు ముగింపు ..
ఎన్నటికైనా అవినీతికి పరాజయం ... నీతికి జయం తప్పదని బాబు మంచి మాట చెబుతున్నారు. దానికి ఆయనో మంచి ఉదాహరణ కూడా చెబుతున్నారు . తమిళనాడులోఅవినీతి కరుణానిధి ఓడిపోయి నీతికి మారుపేరైన జయలలిత గెలిచారు , అలానే ఇక్కడ జగన్ ఓడిపోయి , నేను గెలుస్తాను అని ఆయన చెబుతున్నారు. గతం లో కరుణానిధి తనకు రాజకీయాల్లో గురువు లాంటి వారు అని  ఇదే బాబు గారు చెప్పారు .  దేశం మొత్తం లో అవినీతి పరురాలిగా అత్యధిక ప్రచారం పొందిన గొప్ప నాయకురాలు జయలలిత . అవినీతి కేసులో స్వయంగా కోర్టుకు హాజరు కావలసిందే అని తాజాగా కోర్టు ఆదేశించింది.  సంపాదన విషయం లోజగన్ ముందుండ వచ్చు కానీ జాతీయ పత్రికల్లో సైతం అవినీతిపై ఎక్కువ ప్రచారం లభించింది జయలలితకే జగన్ పై తెలుగునాట మాత్రమే ప్రచారం జరిగింది . మొత్తం మీద అవినీతి పరులే అవినీతి ఉద్యమం లో ముందుండడం మనం చేసుకున్న అదృష్టం 


6 కామెంట్‌లు:

  1. వీటన్నిటిని చూస్తూ ఉంటె..అవినీతి పై యుద్దానికి ..అండగా..నేను సైతం..అని సోనియా అన్నారనుకోండి... సోనియా మేడం ని . జనం అవినీతి తాటిపై నడుస్తున్నవారికి మద్దతు తెల్పుతున్న వనిత అని పతాక శీర్షికలలో..ఉంచుతారని..భయం వేసి..అమ్మో.. గప్ చుప్..అనుకుని ఉంటారు..అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. cinema nirmata message kosam teeyadu.. dani director vere untaru... message may b from directors mind.. nirmata arrest aithe enti?

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత గారు డబ్బు పెట్టె వాడిని నిర్మాత అంటారు. సినిమాకు కథ ఒకరు రాస్తారు. వారిని రచయిత అంటారు. ఆ పాత్రల్లో నటించే వారిని నటులు అంటారు. రచయిత రాసిన కథను పాత్రల ద్వారా దర్శకుడు సినిమాగా తీస్తాడు. దీనికి అయ్యే ఖర్చు నిర్మాత భరిస్తాడు .. ఈ విషయం మాకు తెలుసండి. కానీ నిర్మాత తన అభిరుచికి తగిన కథను, దర్శకున్ని తీసుకుంటారు. లగడపాటి రాజగోపాల్ సోనియా అవినీతిపై సినిమా తీస్తాడా ? ఒక వేళ తీస్తే ఆయన నిర్మాత ఆయనకేం సంబంధం అంటారా?

    రిప్లయితొలగించండి
  4. ఈ మధ్య అవినీతి వ్యతిరేక పోరాటమే ఒక మాస్ మసాలా సినిమా అయిపోయింది. అందుకే వేల కోట్లు సంపాదించిన జగన్, గాలి జనార్ధనరెడ్డి లాంటివాళ్ళు కూడా అవినీతి వ్యతిరేక పోరాటంలో హీరోలవుతున్నారు.

    రిప్లయితొలగించండి
  5. @Murali

    Nice Post...

    Pilla Rajaguruvu yevaroo ardham chesukolekapoyaaa......

    may be THOKA PATHRIKA ki sambandhinchina vaaraa???

    :P


    NAGARAM NIDRA POTHUNNA VELA ane movie okati release indaaa????????

    and...aa movie ni JAGAN FANS addukovadam kudaa jarigindaa?????

    My God....I really Donno abt this

    రిప్లయితొలగించండి
  6. సత్యం పలికారు.....అవినీతి సర్వాంతర్యామి మనిషి నైతికంగా దిగజారడమే ఈ పర్యవసానం........

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం