21, ఫిబ్రవరి 2012, మంగళవారం

వెండితెర మాజీ హీరోయిన్లు బుల్లి తెర తాజా యాంకర్లు



    ఇప్పుడు పలువురు మాజీ హీరోయిన్లు బుల్లితెరపై యాంకర్లుగా ప్రత్యక్షమవుతున్నారు. రోజా, రజని తరువాత ఇప్పుడు ఆమని బుల్లితెరను నమ్ముకున్నారు. వృద్ధ హీరోలు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ ప్రవేశం చేసి తరిస్తున్నారు. కానీ హీరోయిన్లకు మాత్రం రాజకీయాల్లో అవకాశాలు దక్కడం లేదు. దాంతో బుల్లితెరను నమ్ముకుంటున్నారు. వీరు బుల్లితెరపై యాంకర్ల నుండి పోటీ ఎదుర్కొని ఎంత వరకు నిలబడతారో చూడాలి.
తెలుగునాట సినిమా వాళ్లకు చిన్నతెరపై మొదటి నుండి కొంత చిన్నచూపే. చిన్నతెరపై కనిపించే వారికి సినిమాల్లో అవకాశాలు ఉండవనే అభిప్రాయం ఉంది. హిందీలో ఇలాంటి చిన్నచూపు ఏమీ లేకపోయినా తెలుగులో మాత్రం ఇది బాగానే కనిపిస్తుంది. చిన్నతెరపై కనిపిస్తున్నారు అంటే సినిమాల్లో అవకాశాలు లేవు అని ప్రకటించినట్టు అనే అభిప్రాయం తెలుగులో బాగా ఉంది. దానికి తగ్గట్టుగానే హీరో, హీరోయిన్లు, క్యారక్టర్ యాక్టర్లు, కమెడియన్లు ఎవరైనా ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడే చిన్నతెరవైపు చూస్తున్నారు. రజని, రోజా, ఆమని వంటి వారు ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా వివిధ తెలుగు చానల్స్‌లో యాంకర్లుగా కనిపిస్తున్నారు. హీరోయిన్లుగా గతంలో ఉన్న క్రేజీ వల్ల యాంకర్లుగా బాగానే రాణిస్తున్నారు. కానీ పాపులర్ యాంకర్లకు గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నారు. రజని ప్రముఖ హీరోలందరితో నటించారు. బాగా అవకాశాలు ఉన్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుని దశాబ్దకాలానికి పైగా సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు. హఠాత్తుగా ఆమె వార్తల్లో కనిపించారు. తన కుటుంబ జీవితంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావించి ఆసక్తి రేకెత్తించారు. చాలా మంది హీరోయిన్లుగా వెలుగుతున్న కాలంలోనే భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక రూపొందించు కోవడంలో విఫలమవుతున్నారు. తొలి తరం హీరోలు ఇదే విధంగా దెబ్బతింటే ఆ తరువాత వచ్చిన ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారు జాగ్రత్త పడ్డారు. కానీ అదేం దురదృష్టమో హీరోయిన్ల విషయంలో అలాంటి జాగ్రత్తలు సాధ్యం కావడం లేదు. రజని సైతం అలా దెబ్బతిన్నవారే. ఆటుపోట్లను విజయవంతంగా ఎదుర్కొన్న హెచ్‌ఎం టీవిలో కుటుంబ సమస్యలపై సలహాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం పెద్దగా విజయం సాధించలేదు. ఇందిర పేరుతో డిడిలో కనిపించారు. అదీ అంతంత మాత్రమే. ఇప్పుడు ఈటీవి వారి డ్యాన్స్ పోటీల్లో జడ్జిగా కనిపిస్తున్నారు. అస్సలు ఏ మాత్రం మర్యాద పాటించకుండా పోటీ దార్లు ఒకరినొకరు తిట్టుకోవ డం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం కొరియోగ్రాఫర్ల ఈ డ్యాన్స్ కార్యక్రమానికే పరిమితం. హీరోయిన్‌గా ఎంతో అందంగా కనిపించే రజని, ఇలాంటి కార్యక్రమంలో కనిపించడం ఇబ్బందికరమే. ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో! హీరోయిన్లుగా ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగానే టీవి కార్యక్రమాల్లో సైతం తాము ఎలాంటి కార్యక్రమాల్లో అయితే రాణిస్తాం అని బాగా ఆలోచించి అలాంటి వాటికే అంగీకరించడం మంచిది. దాదాపు దశాబ్ద కాలం పాటు రజని తెలుగునాట అందార తారగా ఒక వెలుగు వెలిగారు. తమిళంలో తొలుత నటించి, ఆ తరువాత తెలుగులో స్థిరపడ్డారు. పలు తమిళ, కన్నడ, మళయాళం సినిమాల్లో నటించారు. బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, నాగార్జున వంటి టాప్ హీరోలందరితో రజని హీరోయిన్ గా నటించా రు. ప్రారం
భం లో వచ్చిన కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉన్నా ఇప్పుడు బుల్లితెరపై నెట్టుకు రావడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
రోజా ఇలానే తొలుత తప్పటడుగులు వేసినా తరువాత నిలదొక్కుకున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోగానే ఆమె ఒక వైపు రాజకీయ ప్రవేశంతో పాటు మరోవైపు టీవి కార్యక్రమాలను నమ్ముకున్నారు. మొగుడ్స్ పెళ్లామ్స్ అనే పాపులర్ కార్యక్రమంలో అప్పటి వరకు ఉన్న యాంకర్ స్థానంలో రోజా వచ్చింది. అయితే సురేఖ యాంకరింగ్‌కు అలవాటు పడిన ప్రేక్షకులు రోజాను స్వాగతించలేక పోయారు. తొందరగానే ఈ విషయం గ్రహించినట్టున్నారు. రోజా మరో కార్యక్రమానికి జంప్ అయి నిలదొక్కుకున్నారు. తాజా గా ఆమ ని ఇప్పుడు జీ తెలుగులో నేనే సత్యభామ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హీరోయిన్‌గా తెరమరుగైన తరువాత ఆమె బుల్లితెరపై కనిపిస్తున్న తొలి కార్యక్రమం ఇది. జీ తెలుగులో నేనే సత్యభామ అంటూ ఆమని హడావుడి చేస్తున్నారు. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్ పెళ్లాం సినిమాల్లో మంచి నటిగా పేరు పొందిన ఆమని బుల్లితెర జీవితం ఎలా ఉంటుందో మరి. సత్యభామ అంటే పొగరుకు ప్రతీక. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు కాస్తంతా పొగరు తనంతో ఉంటారు.
పొగరు పాత్రలు హీరోయిన్‌గా ఆమనికి కొట్టిన పిండే.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం