9, మే 2013, గురువారం

‘సంపన్నులను చూసి ఈర్ష్య పడకు... చూసి నేర్చుకో .. ఝుంఝున్ వాలా నేర్చుకున్న తొలి పాఠం

‘సంపన్నులను చూసి ఈర్ష్య పడకు, వారి నుంచి ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకో..’- ఇదీ మా తండ్రి నాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠం. దాన్ని నేను తు.చ తప్పకుండా పాటించాను. దేశంలోని అత్యధిక సంపన్నుల జాబితా 50 మందిలో నా పేరు ఉండడానికి నేను చదువుకునే రోజుల్లో నా తండ్రి నేర్పించిన ఈ పాఠం నాకు ఉపయోగపడింది అంటారు- రాఖేష్ ఝుంఝున్ వాలా. 

ఒక మధ్య తరగతి ఐటి అధికారి కుమారుడైన ఈయన ముంబైలో చదువుకునేప్పుడు క్లాస్‌మేట్స్‌లో చాలా మంది సంపన్నులు ఉండేవారు. వారి గురించి ఇంట్లో చర్చ జరిగినప్పుడు తండ్రి చెప్పిన మాటలను ఝుంఝున్ వాలా మరిచిపోలేదు. ‘నా సంపాదనపై మా తండ్రి ఎప్పుడూ ఆశ పడలేదు. నేను ఆయన ఇంట్లో నివసిస్తున్నాను కానీ ఆయన నా ఇంట్లో నివసించలేదు’ అని 53 ఏళ్ల ఝుంఝున్ వాలా గర్వంగా చెబుతుంటారు. ‘్ఫర్బ్స్’ పేర్కొన్న సంపన్న భారతీయుల జాబితాలో తన పేరు గురించి, తన సంపద గురించి రాసినప్పుడు తండ్రికి ఈయన చెబితే ఆయనలో ఎలాంటి మార్పు లేదు. సంపాదించావు సరే.. ఎంత దానం చేశావు? నీకేమీ అనిపించడం లేదా? అని ప్రశ్నించారట!


శ్రీమంతులంతా విలన్లు, పేద వారిని దోచుకుంటారు అనుకునే పాత కథలకు కాలం చెల్లింది. ఆర్థిక సంస్కరణల తరువాత సంపద వారసత్వంగానే కాదు తెలివి తేటలతో సైతం సంపాదించవచ్చునని రుజువైంది. స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే అదో జూద గృహం అని చాలా మంది నేటికీ భావిస్తారు. కానీ, ఝుంఝున్ వాలాకు మాత్రం స్టాక్ మార్కెట్ ఒక దేవాలయం. ఆయన స్టాక్ మార్కెట్ భక్తుడు. ఇలా విభిన్నంగా ఆలోచించారు కాబట్టే ఆయన దేశంలోని అత్యంత సంపన్నులైన 50 మందిలో ఒకరుగా నిలిచారు. అందరూ ఆలోచించినట్టుగా కాకుండా విభిన్నంగా ఆలోచించడం, పాజిటివ్‌గా ఆలోచించడం విజేతల లక్షణాల్లో ఒకటి. సంపాదించడమే కాదు, ఇప్పుడు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు.

 ‘స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి నన్ను అడగండి ఫరవా లేదు కానీ- ఆరోగ్యం, జీవన శైలి గురించి మాత్రం నన్ను ఆదర్శంగా తీసుకోకండి’-అని నిర్మొహమాటంగా చెబుతారు. 25 ఏళ్ల నుంచి డబ్బు సంపాదన గురించి తప్ప మరోటి ఆలోచించలేదు. ఇంత సంపాదించినా సాధించింది ఏమిటని ఆలోచిస్తే కొంత నిరాశగానే ఉంటుందని, ఒక దశ దాటిన తరువాత డబ్బు పెద్దగా సుఖాన్ని ఇవ్వదని ఆయన చెబుతారు.
దసరా రోజున ఆయుధ పూజ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. వివిధ వృత్తుల్లో ఉన్న వారు ఆ వృత్తికి సంబంధించిన పరికరాలను పూజిస్తారు. నువ్వు చేసే వృత్తిపై నీకు గౌరవం ఉండాలి, నీ వృత్తి పరికరాలు నీకు దేవునితో సమానం అని చెప్పడమే ఈ పూజ ఉద్దేశం. అలాగే ఝుంఝున్ వాలాకు స్టాక్ మార్కెట్ ఒక దేవాలయం లాంటిది. అందుకే దాన్ని ఆయన పవిత్రంగా చూస్తారు. తన పెట్టుబడులు సైతం అదే తరహాలో ఉంటాయి. 1960లో పుట్టిన ఈయన ఇనె్వస్టర్‌లకు ఆదర్శ ప్రాయుడు. హర్షద్ మెహతా లాంటి వాళ్లు స్టాక్ మార్కెట్‌లో తాత్కాలికంగా ఒక వెలుగు వెలిగి అంతే త్వరగా అ దృశ్యమైనా ఝుంఝున్ వాలా లాంటి వారు శాశ్వతంగా ఉంటారు.


స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉన్న భారతీయులందరికీ పరిచయం ఉన్న పేరు గనుకే ఈయన చెరగని ముద్ర వేశారు.
ముంబైకి చెందిన చార్టర్ అకౌంటెంట్ ఝుంఝున్ వాలా పేరు కాస్త భిన్నంగా ఉంది కదూ! ఆయన ఆలోచనా తీరు సైతం అంతే. 2010 నాటికే ఈయర ఆస్తి విలువ ‘్ఫర్బ్స్’ అంచనా ప్రకారం ఒక బిలియన్ డాలర్లు. ఆయన్ని ‘ఇండియన్ వారెన్ బఫెట్’ అని అభిమానంగా పిలుచుకుంటారు. భారత స్టాక్ మార్కెట్‌లో గౌరవనీయమైన ట్రేడర్‌గా మంచి గుర్తింపు ఉంది. రేర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. రాఖేష్ భార్య పేరు రేఖ. ఇద్దరి పేర్లు కలిపి ‘రేర్’ అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ‘మా వ్యాపార సంస్థ పేరులో సైతం మేం చెరి సగంగా ఉంటాం’ అని నవ్వుతూ చెబుతారు ఆయన.


ఆయన తండ్రి ఇన్‌కంటాక్స్ ఆఫీసర్. దాంతో చిన్నప్పటి నుంచే వ్యాపార రంగంతో విడదీయలైని అనుబంధం ఏర్పడింది. భవిష్యత్తులో ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నావో- చదువుకునే రోజుల్లోనే ఆ రంగం పట్ల ఆసక్తి చూపాలని, వీలుంటే ఆ రంగంలో ప్రాథమిక స్థాయిలో ప్రవేశించాలని తండ్రి చెప్పేవారు. ఝుంఝున్ వాలా చేసింది అదే. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఈయన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. చదువు పూర్తయిన తరువాత దానే్న పూర్తి స్థాయి వృత్తిగా స్వీకరించారు. 1985లో వంద డాలర్లతో పెట్టుబడికి శ్రీకారం చుట్టారు. అప్పుడు బిఎస్‌సి సెనె్సక్స్ 150 పాయింట్లు. 1986లో ఐదువేల టాటా టీ షేర్లను 143 రూపాయల చొప్పున విక్రయించారు. వీటిని ఆయన కొనుగోలు చేసింది 43 రూపాయల ధర చొప్పున. కేవలం మూడు నెలల వ్యవధిలో వీటిలో ఆయనకు 0.5 మిలియన్ల ఆదాయం వచ్చింది.

 1986-89 మధ్య కాలంలో 25 లక్షల రూపాయల వరకు గడించారు. తనపై తనకు విశ్వాసం కుదిరిన తరువాత ఝుంఝున్ వాలా ఫార్వర్డ్ ట్రేడింగ్‌కు సైతం సిద్ధపడ్డారు. మైనింగ్ కంపెనీ సిసా గోవాలో ఆయనకు భారీ లాభాలు వచ్చాయి.
1990 ప్రాంతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మధుదండావతేకు తాను కృతజ్ఞుడనై ఉంటానని చెబుతుంటారు ఆయన. ‘వారెన్ బఫెట్’ మాదిరిగానే ఝుంఝున్ వాలా సైతం దీర్ఘకాలిక మదుపరిగా ఉండేందుకే ఇష్టపడతారు. ఆప్‌టెక్ లిమిటెడ్‌కు, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు కంపెనీలకు చైర్మన్‌గా ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్, వైస్రాయ్ హోటల్స్ లిమిటెడ్ వంటి కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. ‘క్యాపిటలిజంలో స్టాక్ మార్కెట్‌ను దేవాలయంగా భావించాలి , నేను అలానే భావిస్తాను ఇదే నా ఇనె్వస్ట్‌మెంట్ ఫిలాసఫీ’ అంటారాయన.


 ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టినప్పుడు అన్ని కోణాల్లో దాని పనితీరు పరిశీలించాలని ఆయన అంటారు. పెట్టుబడులపై తక్షణం లాభాలు దక్కాలని కాకుండా దీర్ఘకాలికంగా ఇనె్వస్ట్ చేయాలని చెబుతారు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఇనె్వస్టర్లకు ఝుంఝున్ వాలా జీవితం పెట్టుబడుల గురించి నేర్పిస్తుంది.

3 కామెంట్‌లు:

  1. డబ్బు సంపాదించాలనే వ్యసనానికి బానిస ఐనవాడికి అదే లోకం తీరని దాహం గా నిరంతర నిత్య తపనగా మారి జీవితాన్ని పూర్తిగా అనుభవిచక ఎండమావి వెనక వెర్రిగా పరుగులు తీస్తాడు ఒక స్థాయి దాటినతర్వాత డబ్బు సుఖాన్నివ్వదు డబ్బుతో నిద్రానందాన్ని కొనలేము!

    రిప్లయితొలగించండి
  2. స్ట్ బాగుంది మురళి గారు."ఝుంఝున్ వాలా" జీవితం స్పూర్తిదాయకం.
    పెద్దల మాట సద్దన్నం మూట అని ఊరికే అనలేదు కదండి.:)

    రిప్లయితొలగించండి
  3. చాలా మంచి పొస్ట్. Inspiring:)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం