11, ఏప్రిల్ 2011, సోమవారం

పురందేశ్వరి , జగన్, జూనియర్ రామారావు , లోకేష్ లలో అధికారం లోకి వచ్చేది ఎవరు

నందమూరి తారక రామారావు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ ని ఏర్పాటు చేశారు. చిత్రంగా ఇప్పుడు ఆ పార్టీ కి మూడో తరం వారసుడు ఎవరా ? అనేదానిపై కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి . తన తరువాత తన కొడుకు కు వారసత్వం లభించలనేది బాబు ప్రయత్నం. సినిమాల్లో రామారావు వారసత్వం తన కుమారుడికి దక్కినట్టుగానే దేశం వారసత్వం తన కుమారుడికి దక్కాలనేది హరికృష్ణ ప్రయత్నం.  కూతురిగా వారసత్వం దక్కించుకోవాలని పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు .  వారసత్వ పోరులో  లోకేష్ నిలుస్తాడా? జూనియర్ గెలుస్తాడ .. లేక కుమార్తె పురందేశ్వరి గెలుస్తార చూడాలి . ముగ్గురిలో  ఎవరు గెలిచినా రాష్ట్ర రాజకీయాల్లో ఒక రికార్డ్ .   వారసత్వ కిరీటం ఎవరికి దక్కేను ? పురందేశ్వరి , జగన్, జూనియర్ రామారావు , లోకేష్ లలో అధికారం లోకి  వచ్చేది ఎవరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం